BigTV English

Ganguly on Rohit Sharma Selection: ఆ టైమ్‌లో నన్ను ఎవరు గుర్తించలేదన్న బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ

Ganguly on Rohit Sharma Selection: ఆ టైమ్‌లో నన్ను ఎవరు గుర్తించలేదన్న బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ

Ganguly Says Who Did Not Recognize Me at That Time: టీ20 ప్రపంచకప్‌ 2024లో టీమిండియా టీమ్ తన సత్తా చాటి విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో దేశమంతటా ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాలు అంబరాన్నంటాయి.అంతేకాదు ఈ జట్టుకు రోహిత్ శర్మ కెఫ్టెన్‌గా సారథ్యం వహించడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.కానీ.. ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది. షాకింగ్ న్యూస్ ఏంటంటే భారత్‌ టీమ్‌కి రాహుల్‌ని కెప్టెన్‌గా చేసింది మాత్రం బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ. ఈ విషయాన్ని అందరూ గాలికొదిలేశారంటూ సౌరవ్ అన్నాడు. అంతేకాదు రోహిత్‌ని కెప్టెన్‌గా అపాయింట్ చేసేటప్పుడు అందరూ తనని తీవ్రంగా విమర్శించారని.. అతని సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ గెలిస్తే మాత్రం టీమ్‌లో ఉన్న సభ్యులు ఎవ్వరు కూడా తనని గుర్తించలేదని గంగూలి తెలిపాడు.


ఇక 2021లో విరాట్ కోహ్లీ సారథ్యంలో జరిగిన టీ20 ప్రపంచకప్ టీమిండియా ఘోర పరాజయం పొందింది.దీంతో నిరుత్సాహానికి గురై పొట్టి ఫార్మాట్ సారథ్యానికి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు.అంతేకాదు వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా అతన్ని బీసీసీఐ తొలగించింది. అప్పట్లో ఈ వ్యవహారం అంతా తీవ్ర దుమారం రేగింది.తనకు కనీసం ఇన్‌ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై మీడియా సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు విరాట్ కోహ్లీని ఒప్పించే ఈ నిర్ణయం తీసుకున్నానని సౌరవ్ గంగూలీ మీడియాకు తెలియజేయగా విరాట్ కోహ్లీ మాత్రం అసలు మ్యాటర్‌ని రివీల్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే విరాట్ కోహ్లీని సారథ్య బాధ్యతల నుంచి తప్పించారనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.

Also Read: క్రికెటర్‌పై వేటు పడే ఛాన్స్.. జింబాబ్వేతో ఆడే ఫైనల్‌ జట్టు ఇదే..


ఈ వ్యవహారం జరిగి నేటికి 4 ఏండ్లు అవుతున్నా సరే,ఇప్పటికీ సౌరవ్ గంగూలీ,విరాట్ కోహ్లీలు మాట్లాడుకోవడం మానేశారు. ఇక 2023 ఏడాదిలో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఓటమిపాలైంది.టీ20 ప్రపంచకప్ 2022లో సెమీస్‌లోనే వెనుదిరిగింది.టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం విజేతగా నిలిచింది.ఈ క్రమంలోనే రోహిత్ శర్మను కెప్టెన్‌ చేసిన క్రెడిట్ తనదేనని గంగూలీ ఈ సందర్భంగా గుర్తుచేశాడు.నేను రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేసినప్పుడు అందరూ నన్ను విమర్శించారు.ఇప్పుడు అతని సారథ్యంలోనే భారత్ టీ20 ప్రపంచకప్ 2024 లో మరిచిపోలేని విధంగా ఎప్పటికి గుర్తుండిపోయేలా ఉండనుందని సంతోషం వ్యక్తం చేశాడు. అంతేకాదు రోహిత్ శర్మ సారథ్యంలో ప్రపంచకప్ గెలవడం నిజంగా గ్రేట్ అంటూ గంగూలీ చెప్పుకొచ్చాడు. దాంతో అందరూ నన్ను విమర్శించడం మానేశారు.ఇక తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఆ విషయాన్ని పూర్తిగా గాలికి వదిలేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.అంతేకాదు రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్‌గా నియమించింది నేనే అంటూ సౌరవ్ గంగూలీ తన మనసులోని ఇంట్రెస్టింగ్ విషయాలను తాజాగా రివీల్ చేశాడు.

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×