E-Paper
Advertisement

రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీది.. కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ ఫైర్..!

రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీది.. కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ ఫైర్..!
Advertisement

బిఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్.. కేటీఆర్‌లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ తీరును తప్పుబడుతూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమకు కేటీఆర్‌లా దోచుకోవడం.. దాచుకోవడం తెలియదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు బేడీలు వేసి అరిగోస పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తు చేశారు. అమాయకులను హింసించడం.. డ్రగ్స్ తీసుకోవడం వంటి అలవాట్లు తమకు లేవని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు.. ఫార్ములా ఈ-రేస్.. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రస్తావిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కేసీఆర్ కుటుంబ అహంకారం వల్లే ప్రజలు వారిని ఓడించి ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారని బండి సంజయ్ విమర్శించారు. వరుస ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతున్నా కేటీఆర్ ధోరణిలో మార్పు రాకపోవడం విచారకరమని పేర్కొన్నారు. అధికారం పోయినా ఇంకా అదే అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాము ఢిల్లీ నుంచి వేల కోట్ల నిధులు తీసుకొస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు కేవలం ఆరోపణలకే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ స్వలాభమే వారికి ముఖ్యమని విమర్శించారు.

Advertisement

కేంద్ర నిధులతోనే తెలంగాణలో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం సహకరించకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ నుంచి తాము నిధులు తెస్తుంటే.. అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సొమ్మును ఢిల్లీలోని తమ పార్టీ పెద్దలకు మూటలు కట్టి పంపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహణ కోసం తెలంగాణ ఖజానాను వాడుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే మోదీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ సభకు తరలిరావాలని కోరారు. తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే మోదీ ప్రధాన నినాదమని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Advertisement

ALSO READ: పాల‌మూరు నుంచి నీటి ఉద్య‌మానికి క‌విత శ్రీ‌కారం! కేసీఆర్ పాల‌న‌లో అన్యాయంపై నిల‌దీత‌!

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×