E-Paper
Advertisement

Kiran Kumar Reddy: ట్రంప్ ఏం చెబితే మోదీ అది చేస్తారా? భువనగిరి ఎంపీ షాకింగ్ కామెంట్స్!

Kiran Kumar Reddy: ట్రంప్ ఏం చెబితే మోదీ అది చేస్తారా? భువనగిరి ఎంపీ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Kiran Kumar Reddy: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం , లోక్ సభ స్పీకర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ,ఇతర విపక్ష ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని చామల ఆరోపించారు. కేవలం బీజేపీ ,ఎన్డీఏ ఎంపీలకే ప్రాధాన్యత ఇస్తూ.. నిశికాంత్ దూబే, అనురాగ్ ఠాకూర్ వంటి వారికి అనవసరంగా మైక్ ఇస్తున్నారని ఆయన విమర్శించారు. 18వ లోక్ సభలో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ, మహిళా ఎంపీలపై తప్పుడు ప్రకటనలు చేయడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వతంత్రంగా వ్యవహరించకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాల విషయంలో వైట్ హౌస్ నిర్ణయాలకు మోదీ తలొగ్గడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై చర్చ జరగాలని, రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు విషయంలో ట్రంప్ భారత్‌పై ఒత్తిడి తేవడం మన సార్వభౌమాధికారానికి గొడ్డలిపెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో విపరీతంగా పెరిగిన గ్యాస్, క్రూడాయిల్ ధరలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ నియమాలను ఉల్లంఘించి ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసే హక్కు సభలోని 543 మంది సభ్యులకు ఉండాలని.. సస్పెండ్ అయిన వారికి కూడా ఆ అవకాశం ఇవ్వాలని కోరారు.

Advertisement

‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అనే నినాదంతో లోక్ సభ మకర్ ద్వార్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఏ ఇతర దేశం లేదా నాయకుడి ఆదేశాలకు లొంగిపోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Also Read: జడ్జికే ‘డిజిటల్’ షాక్.. ఏకంగా రూ. 1.66 కోట్లు నొక్కేసిన సైబర్ కేటుగాళ్లు!

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×