సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం భానూర్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. ఓటర్ల జాబితా దగ్గర పెట్టుకుని మరీ డబ్బు పంపిణీ జరిగింది. బిగ్టీవీ నిఘాలో డబ్బు పంపిణీ దృశ్యాలు బయటపడ్డాయి. మూడో వార్డు అభ్యర్థి సిరాజ్ ఓ ఇంట్లోకి ఓటరు లిస్టు, డబ్బులతో వెళ్లి సర్పంచ్ అభ్యర్థి శాంతయ్యకు, తనకు ఓటేయాలని ఓటర్లను మభ్య పెట్టారు. మీడియా అక్కడకు రావడం చూసి సిరాజ్ పరుగులు పెట్టాడు.
తప్పించుకోవడానికి దారి లేకపోవడంతో కిటికీ ద్వారా ఇంటిపై కప్పు ఎక్కి ఎస్కేప్ అయ్యాడు. తన దగ్గర ఉన్న ఓటరు లిస్టు కింద పడిపోగా దాన్ని గమనించడంతో అందులో ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు ఇంకా ఎవరెవరికి ఇవ్వాలన్న వివరాలు ఉన్నాయి. ఎవరికి మద్యం బాటిళ్లు ఇవ్వాలనే విషయాలను కూడా నోట్ చేసుకున్నారు. నందిగామ గ్రామంలో ఓటర్లకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటిగా ఓటర్లను మభ్య పెట్టారు
ఓటుకు రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వరకు ఇచ్చి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. ఇలా ఒక కుటుంబానికి రెండు పార్టీల నుంచి రూ. 3 లక్షల వరకు వచ్చినట్టు సమాచారం. ఈ విధంగా పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు పంపణి జరగలేదని కొంతమంది చెబుతుంటే.. డబ్బులు అందుకున్న వారు మాత్రం ఖుషీగా ఫీలవుతున్నారు. క్యాసారంలోనూ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కైల అనిత ప్రభాకర్ రెడ్డి విచ్చల విడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేసినట్టు సమాచారం.