BigTV English
Advertisement

Operation Karregutta: అడవిలో ఆపరేషన్ ఫినిష్.. మావోయిస్టులకు ముగింపు పలికినట్లేనా?

Operation Karregutta: అడవిలో ఆపరేషన్ ఫినిష్.. మావోయిస్టులకు ముగింపు పలికినట్లేనా?

Operation Karregutta: పచ్చని అడవుల మధ్య, కాల్పుల మోతలు, బుల్లెట్ల వర్షం, ఆందోళన కలిగించే వాతావరణం. ఇవే 21 రోజుల పాటు కొనసాగిన కర్రెగుట్ట ఆపరేషన్ వాస్తవాలు. ఈ ఆపరేషన్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలో జరిగింది. ఉత్కంఠభరితమైన ఈ ఆపరేషన్, మావోయిస్టుల స్థావరాలను ధ్వంసం చేయడం, ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంతో భద్రతా బలగాల శక్తిని చాటిందని పోలీసులు అంటున్నారు. ఆపరేషన్ ముగిసిన సంధర్భంగా బీజాపూర్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇవే.


తీవ్ర పోరాటం..
21 రోజుల పాటు జరిగిన ఈ కూంబింగ్ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతి చెందిన మావోయిస్టులపై 1.72 కోట్ల రూపాయల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 18 మంది జవాన్లు గాయపడ్డారు. అయితే, ఈ యుద్ధంలో భద్రతా బలగాలు నెగ్గినట్లుగా తెలుస్తోంది. భారీగా ఆయుధాలు, బుల్లెట్లు, ల్యాండ్ మైన్‌లు, తుపాకులు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

ఆయుధాల స్వాధీనం..
ఈ ఆపరేషన్‌లో మావోయిస్టుల 214 డంప్‌లు గుర్తించబడ్డాయి. అటవీ ప్రాంతంలో ఉన్న ఆయుధాల నుంచి, బుల్లెట్లు, తుపాకులు, కాండెక్స్ వైర్లు, ఇండెక్స్ వైర్లు, ఫ్యూజ్ వైర్లు వంటి సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. 35 రైఫిల్స్, 450 ఐఈడీలు, డిటోనేటర్లు, ఇండెక్స్ వైర్ల బండిల్స్, బుల్లెట్లు, ఫ్యూజ్ వైర్లు, ఇతర సామాగ్రి, 12 టన్నుల రేషన్ సరుకులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.


గుహల ధ్వంసం..
మామూలు స్థావరాలనే కాకుండా, PLGA మరియు CRC దళాలకు సంబంధించిన గుహలను కూడా బాంబులతో ధ్వంసం చేయడంపై పోలీసులు ప్రత్యేకంగా వెల్లడించారు.

పోలీసుల ప్రకటన..
ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. మావోయిస్టుల కట్టడాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం, మరింతగా ప్రభుత్వ బలగాల విజయాన్ని నిరూపించాయన్నారు. వీరంగా, భద్రతా బలగాలు, తమ సమర్థతను మరోసారి చూపించి, తాము చేసే కూంబింగ్ ఆపరేషన్లలో అత్యధిక స్థాయికి ఎదుగుతున్నారని తెలిపారు.

Also Read: Pawan Kalyan: పవన్ ఓ అబద్ధాల కొరివి.. నీది నాలుకేనా అంటూ నిర్మాత ఫైర్

విజయమే..
ఈ ఆపరేషన్ భద్రతా బలగాలకు కేవలం ఒక విజయమే కాకుండా, భవిష్యత్తులో మరింత ప్రాముఖ్యాన్ని పొందే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కర్రెగుట్ట ఆపరేషన్ జవాన్ల ధైర్యం, శ్రమ, వ్యూహాత్మక విజయానికి సాక్షిగా నిలిచిందని వారు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ కాల్పుల పట్ల పలు ప్రజా సంఘాలు విమర్శలు వినిపించాయి. అలాగే మావోలపై తూటాల వర్షం వెనుక పలు విమర్శలు రాగా, పోలీసులు మాత్రం ఆపరేషన్ ఫినిష్ అంటూ ప్రకటించారు.

Related News

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Mahesh Kumar Goud: బీజేపీ ఎక్కడ పోటీ చేసినా.. అక్కడ ఓట్ చోరీ పక్కా..

Bandi Sanjay: ఆలయాలు కూల్చేస్తారా? 48 గంటలు టైం ఇస్తున్నా.. బండి సంజయ్ సంచలనం

Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం

Big Stories

×