E-Paper
Advertisement

Hyderabad News: శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. మూడు విమానాలకు బాంబు బెదిరింపు, అధికారులు అలర్ట్

Hyderabad News: శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. మూడు విమానాలకు బాంబు బెదిరింపు, అధికారులు అలర్ట్
Advertisement

Hyderabad News: ఇండిగో విమానాల సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది దేశం. రేపు లేదా ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిలో విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో విమానాలకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతున్నాయి.  శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విదేశాల నుంచి పలు విమానాలు వచ్చాయి. వాటిలో బాంబులు ఉన్నట్లు ఆగంతకుల నుంచి ఈ-మెయిల్స్ వచ్చింది. వెంటనే అధికారులు ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టు అలర్ట్

Advertisement

సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విదేశాల నుంచి పలు విమానాలు వచ్చాయి. వాటిలో ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన విమానం, లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ కి చెందిన మరో విమానం ఉంది. దీనికితోడు కేరళలోని కన్నూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇండిగో విమానం వచ్చింది.

Advertisement

కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్ట్ – హైదరాబాద్ ఇండిగో ఎయిర్ లైన్స్ (6e7178)

ఫ్రాంక్ ఫాంట్ – హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ (LH-752)

లండన్- హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్ లైన్స్ ఉన్నాయి.

మూడు విమానాలకు బాంబు బెదిరింపు

ఈ మూడింటిలో బాంబు ఉన్నట్లు సోమవారం ఉదయం ఎయిర్‌పోర్టు అధికారులకు ఆగంతకుల నుంచి ఈ-మెయిల్ వచ్చింది. వెంటనే ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అప్పటికే రన్వేలో మూడు విమానాలు సురక్షితంగా ల్యాండింగ్ అయ్యాయి. 

వెంటనే సీఐఎస్‌ఎఫ్, బాంబ్ స్క్వాడ్‌ తో కలిసి సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు భద్రతా సిబ్బంది. అనుమానం వచ్చిన ప్రతి లగేజీని చెక్ చేస్తున్నారు. తనిఖీల తర్వాత ప్రయాణికులను ఎయిర్‌పోర్టు నుంచి ఐసోలేషన్ కు తరలించారు అధికారులు. మరోవైపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై క్షుణ్నంగా దర్యాప్తు మొదలుపెట్టారు.  

ALSO READ: సోమవారం నుంచి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభం

సోమవారం నుంచి హైదరాబాద్‌లో ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025’ జరగనుంది.  44 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ మధ్యాహ్నం సమ్మిట్ ప్రారంభంకానుంది. అంతలోనే బాంబు బెదిరింపులు అంటూ ఈ-మెయిల్స్ రావడంతో అక్కడి అధికారుల్లో కాస్త టెన్షన్ మొదలైంది. ఎవరో ఆకతాయిలు కావాలని చేసి ఉండవచ్చని కొందరు అధికారుల మాట. అయినా పూర్తిగా చెక్ చేస్తేనేగానీ చెప్పలేమని అంటున్నారు. 

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×