E-Paper
Advertisement

Aghori Latest Update: కుశ్నపల్లిలో టెన్షన్.. టెన్షన్.. వెనక్కు తగ్గిన అఘోరి.. చివరకు?

Aghori Latest Update: కుశ్నపల్లిలో టెన్షన్.. టెన్షన్.. వెనక్కు తగ్గిన అఘోరి.. చివరకు?

Breaking news: మంచిర్యాల జిల్లా కుశ్నపల్లి గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేస్తూ, వైరల్ గా మారిన అఘోరి.. తన స్వగ్రామానికి చేరుకోవడంతో, భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. తాను ఆత్మార్పణకు సిద్ధమంటూ అఘోరీ ప్రకటించి, స్వగ్రామానికి రావడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున గ్రామం వద్దకు చేరుకున్నారు. అయితే బయటి వ్యక్తులు ఎవరూ గ్రామంలోకి రాకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

వెనక్కు తగ్గిన అఘోరీ?
తాను సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణ చేసుకుంటానని అఘోరీ ప్రకటించి, తన తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అఘోరీ స్వగ్రామం కుశ్నపల్లికి రాగా, పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే భక్తుల కోరిక మేరకు తన ఆత్మార్పణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు సమాచారం. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చినటువంటి భక్తులకు, అఘోరీ ఆశీర్వాదం ఇస్తూ.. నుదుటిపై తిలకం దిద్దుతున్న పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. మొత్తం మీద ఆత్మార్పణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తమతో తెలపడం, ఎంతో ఆనందంగా ఉందని భక్తులు తెలుపుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు భక్తులు సహకరిస్తామంటూ ప్రకటించడంతో, అఘోరీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు అఘోరీ ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×