E-Paper
Advertisement

Congress : గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరికలు..

Congress : గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరికలు..
Advertisement

Congress : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. చాలామంది నేతలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. తాజాగా పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, గద్వాల జిల్లా పరిషత్‌ ఛైర్ పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య ఆధ్వర్యంలో గద్వాల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు. 30 మంది సర్పంచ్‌లు, 12 మంది ఎంపీటీసీలు హస్తం గూటికి చేరారు. వారికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయ్యిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గద్వాల ప్రజలను బంగ్లా ముందు బానిసలుగా మార్చారని విమర్శించారు. గద్వాల జిల్లా కాంగ్రెస్‌ కంచుకోటని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపిద్దామని రేవంత్ పిలుపునిచ్చారు.

Advertisement

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇవ్వాలని సవాల్ చేశారు. కేసీఆర్‌ గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రేవంత్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు.

Tags

Related News

కేసీఆర్ దూకుడుతో కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్!

నర్సు హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మేజిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశం!

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సు, మెట్రోకు ఒకే పాస్!

హోం మంత్రి మన రేవంతన్నే.. పబ్ రచ్చపై ఆర్ఎస్పీ సెటైర్లు !

రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు సీఎం రేవంత్ ప్రవేశపెట్టే కీలక నివేదికలివే?

మీ కోడళ్లకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా.. డీజీపీ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!

అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

3 ఏళ్ల బాబు మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్ చేసింది వాళ్లే

Big Stories

Advertisement
×