E-Paper
Advertisement

BRS Party: బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్..

BRS Party: బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్..

BRS Party: వరంగల్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ జిల్లా నేతల సమావేశంలో కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.

కేసీఆర్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఫైనల్ చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఆ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ నాయకులతో సమావేశమైన కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ ప్రస్తుతం హన్మకొండ జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2001 నుంచి సుధీర్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎంపీ అభ్యర్థిగా సుధీర్ సరైన వ్యక్తిగా భావిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని నియోజకవర్గ నేతలు ఆమోదించారు. అయితే ఈ టికెట్ తొలుత.. ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ టికెట్ రాజయ్యకు దక్కకపోవడంతో ఆయన పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

కాగా, గతంలో వరంగల్ ఎంపీ టికెట్ ను బీఆర్ఎస్ కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కేటాయించింది. అయితే ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ టికెట్ ను కేసీఆర్ మారేపల్లి సుధీర్ కుమార్ కు కేటాయించారు.

Tags

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×