E-Paper
Advertisement

BRS Party: బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్..

BRS Party: బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్..
Advertisement

BRS Party: వరంగల్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ జిల్లా నేతల సమావేశంలో కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.

కేసీఆర్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఫైనల్ చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఆ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ నాయకులతో సమావేశమైన కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

Advertisement

మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ ప్రస్తుతం హన్మకొండ జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2001 నుంచి సుధీర్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎంపీ అభ్యర్థిగా సుధీర్ సరైన వ్యక్తిగా భావిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని నియోజకవర్గ నేతలు ఆమోదించారు. అయితే ఈ టికెట్ తొలుత.. ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ టికెట్ రాజయ్యకు దక్కకపోవడంతో ఆయన పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

కాగా, గతంలో వరంగల్ ఎంపీ టికెట్ ను బీఆర్ఎస్ కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కేటాయించింది. అయితే ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ టికెట్ ను కేసీఆర్ మారేపల్లి సుధీర్ కుమార్ కు కేటాయించారు.

Tags

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×