BigTV English
Advertisement

Medigadda Repair: మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు.. ఎల్అండ్ టీ లేఖతో బయటపడ్డ నిజాలు..

Medigadda Repair: మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు.. ఎల్అండ్ టీ లేఖతో బయటపడ్డ నిజాలు..

Medigadda Repair: అబద్ధం.. అబద్ధం.. అబద్ధం.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందంతా అబద్ధమని బట్టబయలైంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ల భారం నయా పైసా ప్రభుత్వంపై పడదని అప్పట్లో బీఆర్ఎస్ ప్రకటించిందంతా బూటకమేనని తేటతెల్లమైంది. మేడిగడ్డ కుంగడంతో ఆ ప్రభావం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా.. బ్యారేజీ నిర్మించిన ఎల్అండ్ టీ సంస్థనే రిపేర్లు చేసి ఇస్తుందని ప్రజలను నమ్మించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందని.. అధికారులు, ఇంజినీర్లతో నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పించిందని స్పష్టమైంది.


బ్యారేజీలోని ఏడో బ్లాక్ లో కుంగిన పిల్లర్ల రిపేర్లను నిర్మాణ సంస్థ ఎల్అండ్ నే చేస్తుందని అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పగా.. రిపేర్లతో తమకేమీ సంబంధం లేదని ఎల్అండ్ టీ కుండబద్దలు కొట్టింది. చేపట్టాల్సిన రిపేర్లకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టుగా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఐదేండ్లు కాదని రెండేండ్లేనని.. ఆ గడువు కూడా ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసిందనే నిజాన్ని ఎల్అండ్ టీ వెల్లడించింది. బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేయడానికి ఖర్చయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని.. అందుకోసం తమ సంస్థతో మళ్లీ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో మేడిగడ్డ రిపేర్ల భారం ప్రజలపైనే పడనుంది.

కాగా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసిందని తెలిసినా ఎన్నికల్లో గెలుపు కోసమే…. అప్పటి కేసీఆర్ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టించిందనే విషయం ఇప్పుడు ఎల్అండ్ టీ లేఖతో బయటపడడంతో బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న.. శాసన మండలిలో.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో జరిగిన డ్యామేజీలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.


శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రసంగించే సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి మేడిగడ్డ గురించి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ ఎందుకు కుంగిపోయిందో… ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటామని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తామని కూడా చెప్పారు.

ఈ ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ ఏడో బ్లాక్ లోని పిల్లర్లు కుంగాయి. దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చని మొదట ప్రాజెక్టు ఇంజినీర్లు పోలీసులకు కంప్లయింట్ చేయగా, సాంకేతిక కారణాలతోనే బ్యారేజీ కుంగినట్టుగా తేలింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్) చైర్మన్ ఆధ్వర్యంలోని ఎక్స్ పర్ట్ టీమ్ బ్యారేజీని పరిశీలించి డిజైన్ల లోపం, నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టకపోవడంతోనే కుంగినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.

.

.

Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×