E-Paper
Advertisement

Sangareddy Crime: దారుణ హత్య.. తల్లికొడుకులను కిరాతకంగా చంపారు, సంగారెడ్డి జిల్లాలో ఘటన

Sangareddy Crime: దారుణ హత్య.. తల్లికొడుకులను కిరాతకంగా చంపారు, సంగారెడ్డి జిల్లాలో ఘటన
Advertisement

సంగారెడ్డి జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్‌లో తల్లీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. జేపీ కాలనీలో నివసిస్తున్న చంద్రకళ (30), ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు రోహిత్ ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నింపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు చంద్రకళకు తన భర్తతో గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో భర్త ఆమెను వదిలిపెట్టడంతో.. మనస్తాపానికి గురైన చంద్రకళ కేవలం మూడు రోజుల క్రితమే తన కుమారుడు రోహిత్‌ను తీసుకుని తెల్లాపూర్‌లోని జేపీ కాలనీకి మకాం మార్చింది. కొత్త నివాసంలో స్థిరపడకముందే.. గుర్తుతెలియని వ్యక్తులు వీరిద్దరినీ అత్యంత దారుణంగా హతమార్చారు.

Advertisement

ఈ జంట హత్యల వెనుక అక్రమ సంబంధం కోణం ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రకళ వ్యక్తిగత జీవితం, ఆమె గత పరిచయాలు లేదా వివాహేతర సంబంధాలే ఈ ఘాతుకానికి దారితీసి ఉండవచ్చనే దిశగా దర్యాప్తు సాగుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు, మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్ ద్వారా కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. అసలు హత్యకు గల కారణాలేమిటి..? దీని వెనుక ఎవరి హస్తం ఉంది..? భర్తతో ఉన్న గొడవలే కారణమా లేక మరేదైనా వివాదం ఉందా..? అనే పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉంది. పట్టపగలే ఇలాంటి దారుణం జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement

ALSO READ: Vande Bharat Train: ఫుల్లుగా తాగి ట్రాక్ మీద ఆటోను వదిలేసిన డ్రైవర్, ఒక్కసారిగా వందేభారత్..

Related News

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Big Stories

Advertisement
×