E-Paper
Advertisement

Vande Bharat Train: ఫుల్లుగా తాగి ట్రాక్ మీద ఆటోను వదిలేసిన డ్రైవర్, ఒక్కసారిగా వందేభారత్..

Vande Bharat Train: ఫుల్లుగా తాగి ట్రాక్ మీద ఆటోను వదిలేసిన డ్రైవర్, ఒక్కసారిగా వందేభారత్..
Advertisement

Vande Bharat Emergency Stop: వందేభారత్ లోకో పైలెట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. కాసరగోడ్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ (రైలు నం. 20633)కు రాత్రి 10 గంటలకు ఊహించని ఘటన ఎదురయ్యింది.  రైల్వే ట్రాక్ మీద ఆటో అడ్డంగా నిలిపి ఉండటాన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రైలు ఆటోను తగలక ముందే ఆగిపోయిందని అధికారులు తెలిపారు. ఆ ఆటోలో డ్రైవర్, ప్రయాణీకులు లేరని తెలిపారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?   

కాసరగోడ్ కు చెందిన సుధి అనే ఆటో డ్రైవర్ నిన్న సాయంత్రం బాగా మద్యం సేవించాడు. తాగిన మైకంలో రాత్రి సమయంలో ఆటోను రైల్వే ట్రాక్ మీదే వదిలేసి వెళ్లిపోయాడు. రాత్రి సుమారు 10.10 ఆ రూట్ లో వందేభారత్ రైలు వచ్చింది. దూరంగా ఉండగానే రైల్వే ట్రాక్ మీద ఆటో ఉన్నట్లు లోకో పైలెట్ గుర్తించాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. రైలు ఆటో దగ్గరికి వెళ్లి ఆగిపోయింది. వెంటనే, ఈ విషయాన్ని రైల్వే అధికారులకు చెప్పాడు. రైల్వే రక్షణ దళం, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పాటు స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనాన్ని ట్రాక్ మీద నుంచి పక్కకు తీశారు. భద్రతా తనిఖీల తర్వాత, రైలు రాత్రి 11:15 గంటలకు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించి రాత్రి 11:50 గంటలకు తిరువనంతపురం సెంట్రల్‌కు చేరుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, సాధారణ సేవలకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడలేదని తెలిపారు.

ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

Advertisement

అటు లోకో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతోనే ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. పెను ప్రమాదం నుంచి ప్రయాణీకుల ప్రాణాలను కాపాడిన పైలెట్ ను అభినందించారు. అదే సమయంలో ట్రాక్ మీద ఆటోను వదిలి వెళ్లిన డ్రైవర్ సుధిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: 50 ఎకరాల్లో ప్రపంచ స్థాయి వండర్‌ లా.. విశాఖ దశ తిరిగిపోవాల్సిందే!

రైలు ప్రమాదంలో 8 ఏనుగులు మృతి

Advertisement

రీసెంట్ గా అస్సాంలోని లమ్డింగ్ డివిజన్‌లో సైరంగ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ ప్రెస్ రైల్వే ట్రాక్ దాటుతున్న మందను ఢీకొట్టడంతో  ఎనిమిది ఏనుగులు మరణించాయి. దట్టమైన పొగమంచు కారణంగా విజుబులిటీ తగ్గడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు సూచించారు. జమునాముఖ్-కాంపూర్ విభాగంలో తెల్లవారుజామున 2.17 గంటల ప్రాంతంలో దట్టమైన పొగమంచు దృశ్యమానతను తగ్గించిందని, దీని ఫలితంగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లోకోమోటివ్, ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే, ఈ సంఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు ఈ ప్రమాదం కారణంగా అస్సాం, ఈశాన్య ప్రాంతాలలో రైలు సేవలు నిలిచిపోయాయి.

Read Also: హైదరాబాద్ నుంచి ఏపీలోని ఈ నగరాలకు బుల్లెట్ ట్రైన్.. ఎప్పుడు మొదలుకానుందంటే?

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×