E-Paper
Advertisement

Hyderabad: మాదాపూర్‌లో కారు బీభత్సం.. అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు..

Hyderabad: మాదాపూర్‌లో కారు బీభత్సం.. అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు..

Hyderabad: నగరంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. బైకులు, కార్లతో నానా హంగామా చేస్తున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్‌లో బుధవారం అర్ధరాత్రి ఓ కారు భీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన కారు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. మద్యం మత్తులో కారు నడిపి ఉంటారని పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం తర్వాత కారుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. వాహనం ఎవరు నడిపారన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

మరోవైపు కరీనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. రామడుగు మండల కేంద్రానికి చెందిన సామంతుల శివాజీ.. నీలం అరుణ్ అనే ఇద్దరు యువకులు కరీంనగర్ నుండి సొంత ఊరి వైపు వస్తుండగా.. షానగర్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం వీరి బైక్‌ని ఢీ కొట్టింది.

Also Read: మెదక్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిపై..

అయితే రెండు వాహనాలు వేగంగా రావడంతో శివాజీ అనే యువకుడి స్పాట్ లోనే మృతి చెందాడు. కొద్ది సేపటి తర్వాత నీలం అరుణ్ ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి దేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే యువకుల మరణించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరవతున్నారు.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×