E-Paper
Advertisement

BRS Party : జూబ్లీహిల్స్ కారులో డిష్యూం డిష్యూం.. కేటీఆర్ సీరియస్..

BRS Party : జూబ్లీహిల్స్ కారులో డిష్యూం డిష్యూం.. కేటీఆర్ సీరియస్..
Advertisement
brs party

BRS Party Updates(Political news today telangana) :బీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు ముదురుతోంది. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే మాగంటి వర్సెస్ రావుల మధ్య వర్గపోరు సాగుతోంది. బోనాలు ఫ్లెక్సీ వివాదం మరో మలుపు తిరిగింది. TSEWIDS ఛైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డిపై కార్పొరేటర్ దేదీప్యారావు ఫిర్యాదు చేశారు.

Advertisement

రెండు రోజుల క్రితం రావుల అనుచరుడు గణేశ్‌పై.. మాగంటి అనుచరులు దాడి చేశారు. బోనాలు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేకుండా రావుల ఫోటో పెట్టినందుకు.. ఆయన అనుచరుడు గణేష్ పై మాగంటి అనుచరులు దాడి చేసిన ఘటనపై పోలీసు కేసు నమోదైంది. గణేష్ కంప్లైంట్ తో మాగంటి పీఏపై పోలీసులు కేసు పెట్టారు. లేటెస్ట్‌గా రావుల శ్రీధర్‌రెడ్డిపై కార్పొరేటర్ దేదీప్యారావు కేసు పెట్టారు.

ఈనెల 16న బోనాల ఉత్సవాల్లో శ్రీధర్ రెడ్డికి దేదీప్యరావుకు మధ్య వాగ్వాదం జరిగింది. తనకు సమాచారం ఇవ్వకుండా రావడంపై కార్పొరేటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను అసభ్య పదజాలంతో దూషించాడంటూ దేదీప్యారావు ఆరోపించారు. ఆమె ఫిర్యాదుతో రావుల శ్రీధర్‌రెడ్డిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపిసి 506,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

జూబ్లీహిల్స్ నాయకుల మధ్య ఆధిపత్య పోరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. సంయమనం పాటించాలని ఇరువురు నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×