Merugu Madhu: స్వేచ్చ బ్యూరో: నల్గొండ జిల్లా కేంద్రానికి విచ్చేసిన కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు మెరుగు మధు బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్, గౌరవ సలహాదారు పాముల అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ.. యువత సినిమాలను కేవలం వినోద సాధనంగా కాకుండా సమాజానికి మేలు చేసే అంశాలను గ్రహించే వేదికగా చూడాలని సూచించారు.
Also Read: HYDRAA: హైదరాబాద్కు కొత్తగా మెట్ ఎమర్జెన్సీ టీమ్స్.. రంగంలోకి 51 బృందాలు..!
సినిమాల్లో ప్రదర్శించే సానుకూల సందేశాలు, క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి విలువలను యువత ఆచరణలో పెట్టి సమాజ హితం కోసం కృషి చేయాలని కోరారు. అదే సమయంలో సినిమాల్లో కనిపించే ప్రతికూల పాత్రలు, హింసాత్మక ధోరణులు, చెడు అలవాట్లను అనుకరించడం వల్ల యువత భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. యువత మంచి విషయాలను స్వీకరించి వ్యక్తిత్వ వికాసంతో పాటు సమాజ అభివృద్ధికి తోడ్పడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నాయకులు బోళ్ల నాగరాజు, నారగోని వెంకట్, వనం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Also read: 23 రోజుల కింద తల్లి అయింది..ఇప్పుడు సెంచరీతో ఇరగదీసిన లెస్బియన్ క్రికెటర్