E-Paper
Advertisement

Telangana High Court : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు విచారణ… వాదనలు వినిపించేందుకు గడువు కోరిన ప్రభుత్వం, కోర్టు ఏం చెప్పిందంటే ?

Telangana High Court : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు విచారణ… వాదనలు వినిపించేందుకు గడువు కోరిన ప్రభుత్వం, కోర్టు ఏం చెప్పిందంటే ?
Advertisement

Telangana High Court :  ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును ఇవాళ హైకోర్టు విచారించింది. ఈ మేరకు సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ లో అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది.

సమయం కావాలి…

Advertisement

ఈ సందర్భంగా వాదనలు వినిపించేందుకు తమకు మరింత సమయం కావాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ కోరారు. ఫలితంగా కేసు విచారణను వచ్చే నెల 4కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు…

Advertisement

బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని ఆ పార్టీ కేసు వేసింది. వీరిపై అనర్హత వేటు వేసేలా శాసనసభాపతికి తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టు గడప తొక్కారు.

సింగిల్ బెంచ్ ఏం చెప్పిందంటే…

ఈ మేరకు వారి పిటిషన్ ను విచారించిన సింగిల్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై వివరాలు చెప్పేందుకు 4 వారాల గడువు ఇస్తున్నామని ప్రభుత్వానికి చెప్పింది.

ఈలోగా పూర్తి వివరాలతో రాకుంటే తామే తగిన ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని అసెంబ్లీ కార్యదర్శిని హెచ్చరించింది.

వచ్చే నెల 4కి వాయిదా…

ఈ నేపథ్యంలోనే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ లో  అప్పీల్ చేశారు. దీనిపై గురువారం విచారించిన కోర్టు, తదుపరి విచారణను వచ్చే నెల 4తేదీకి వాయిదా వేస్తూ తీర్పును ఇచ్చింది.

also read : పోలీసుల భార్యలే రోడ్డెక్కారు.. వారే అరెస్ట్ చేశారు.. పోలీస్ సంస్మరణ వారోత్సవాల సమయంలో సంచలనం.. ఎక్కడ జరిగిందంటే?

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×