BigTV English
Advertisement

Telangana High Court : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు విచారణ… వాదనలు వినిపించేందుకు గడువు కోరిన ప్రభుత్వం, కోర్టు ఏం చెప్పిందంటే ?

Telangana High Court : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు విచారణ… వాదనలు వినిపించేందుకు గడువు కోరిన ప్రభుత్వం, కోర్టు ఏం చెప్పిందంటే ?

Telangana High Court :  ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును ఇవాళ హైకోర్టు విచారించింది. ఈ మేరకు సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ లో అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది.


సమయం కావాలి…

ఈ సందర్భంగా వాదనలు వినిపించేందుకు తమకు మరింత సమయం కావాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ కోరారు. ఫలితంగా కేసు విచారణను వచ్చే నెల 4కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.


పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు…

బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని ఆ పార్టీ కేసు వేసింది. వీరిపై అనర్హత వేటు వేసేలా శాసనసభాపతికి తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టు గడప తొక్కారు.

సింగిల్ బెంచ్ ఏం చెప్పిందంటే…

ఈ మేరకు వారి పిటిషన్ ను విచారించిన సింగిల్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై వివరాలు చెప్పేందుకు 4 వారాల గడువు ఇస్తున్నామని ప్రభుత్వానికి చెప్పింది.

ఈలోగా పూర్తి వివరాలతో రాకుంటే తామే తగిన ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని అసెంబ్లీ కార్యదర్శిని హెచ్చరించింది.

వచ్చే నెల 4కి వాయిదా…

ఈ నేపథ్యంలోనే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ లో  అప్పీల్ చేశారు. దీనిపై గురువారం విచారించిన కోర్టు, తదుపరి విచారణను వచ్చే నెల 4తేదీకి వాయిదా వేస్తూ తీర్పును ఇచ్చింది.

also read : పోలీసుల భార్యలే రోడ్డెక్కారు.. వారే అరెస్ట్ చేశారు.. పోలీస్ సంస్మరణ వారోత్సవాల సమయంలో సంచలనం.. ఎక్కడ జరిగిందంటే?

Related News

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Jubilee Hills: మాగంటి డెత్ మిస్ట‌రీ.. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ చీప్ పాలిటిక్స్.. మరీ ఇంత దిగజారాలా..?

Jubilee Hills bypoll: జూబీహిల్స్‌ బైపోల్‌లో సైలెంట్ వేవ్ రాబోతుంది.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Cyber Crime Hyderabad: సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. ఒక్క నెలలో 55 మంది అరెస్ట్

Big Stories

×