E-Paper
Advertisement

Flyover: ప్రజలారా.. ఆ ఫ్లై ఓవర్ మీరే ఓపెన్ చేసుకోండి.. కేటీఆర్ పిలుపు

Flyover: ప్రజలారా.. ఆ ఫ్లై ఓవర్ మీరే ఓపెన్ చేసుకోండి.. కేటీఆర్ పిలుపు

Hyderabad: కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం మొదలు పెట్టిన ఫ్లై ఓవర్
పూర్తయిందని, కానీ, దాన్ని ఓపెన్ చేసే నాథుడు లేడని విమర్శించారు. కాబట్టి, సంబంధిత అధికారులు ఆ ఫ్లైఓవర్‌ను ఓపెన్
చేయాలని సూచించారు. లేదా ప్రజలే తమకు తాముగా ఆ ఫ్లై ఓవర్‌ను ఓపెన్ చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. గోపన్ పల్లి
ఫ్లైఓవర్ గురించి ఆయన ఈ హాట్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు సంధించారు.

‘అసమర్థ ప్రభుత్వం, ఏమీ తెలియని నాయకుడు ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. గోపన్‌పల్లి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని
తమ ప్రభుత్వం మొదలు పెట్టింది. నల్లగండ్ల, గోపన్‌పల్లి, తెల్లాపూర్, చందానగర్ ప్రజలకు ట్రాఫిక్ ఉపశమనం తేవడంలో
భాగంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకున్నాం. కొన్ని నెలల క్రితమే ఆ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. కానీ, ఈ రోజుకి
కూడా ఓపెనింగ్ కోసం ఈ ఫ్లైఓవర్ ఎదురుచూస్తున్నది. ఎందుకంటే సీఎం అటు ఢిల్లీ పెద్దలు, ఇటు బీఆర్ఎస్ చట్టసభ్యుల ఇళ్ల
చుట్టు తిరగడానికే సరిపోతున్నారు’ అని తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్.

‘కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల కష్టాలు, సౌకర్యాల కంటే కూడా దాని పీఆర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తున్నది.
అందుకే సంబంధిత అధికారులు ఆ ఫ్లైఓవర్‌ను ఓపెన్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లేదంటే ప్రజలు వారికి
వారుగా ఆ ఫ్లైఓవర్ ఓపెన్ చేసి వినియోగించుకుంటే సరి’ అని ట్వీట్ చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చుట్టూ సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని కేటీఆర్ విమర్శలు చేస్తున్నప్పటికీ వాస్తవంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ నాయకులను అప్రోచ్ అవుతున్నారు. పార్టీలో పదవులు లేకున్నా చేరుతున్నారు. నేడు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ఈ మేరకు స్పష్టం చేశారు. తమను ఎవరూ భయపెట్టడం లేదని, బలవంతం చేయడం లేదని, తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఇష్టపూర్తిగా నిర్ణయం తీసుకుని తామే అధికార పార్టీలోకి వెళ్లుతున్నట్టు వెల్లడించారు.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×