E-Paper
Advertisement

India Population: 2060 నాటికి 170 కోట్ల భారత జనాభా: ఐరాస

India Population: 2060 నాటికి 170 కోట్ల భారత జనాభా: ఐరాస
Advertisement

India Population(Today’s international news): భారత జనాభా 2060 నాటికి సుమారు 170 కోట్లు దాటుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతుందని వెల్లడించింది. 2100 వరకు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 పేరిట ఓ నివేదిక విడుదల చేసింది. 2100 నాటికి చైనా జనాభా 78.6 కోట్లు తగ్గి.. 63 కోట్లకు పరిమితం అవుతుందని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

గతేడాది చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఎదిగిన భారత్ ఈ శతాబ్ధం మొత్తం అదే హోదాను కలిగి ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2024లో భారత్ జనాభా 145 కోట్లని తెలిపింది. 2054 నాటికి అది 169 కోట్లకు చేరుతుందని వెల్లడించింది. ఈ తర్వాత క్రమంగా 150 కోట్లకు తగ్గుతుందని పేర్కొంది. భారత జనాభా 2060 నాటికి క్రమంగా 170 కోట్ల గరిష్ట స్థాయికి పెరుగుతుందని వెల్లడించింది. తర్వాత 12 శాతం తగ్గుదల రేటుతో దిగివస్తుందని తెలిపింది.

Advertisement

2100 నాటికి భారత్ జనాభా: ప్రస్తుతం చైనా జనాభా 142 కోట్లు అని.. 2054 నాటికి అది 121 కోట్లు తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. 2100 నాటికి 63.3 కోట్లకు పడిపోతుందని అంచనా వేసింది. 2100 నాటకి చైనా జనాభా రెండున్నర రెట్లు ఎక్కువ ఉంటుందని వెల్లడించింది. 2024-54 మధ్య చైనా జనాభాతో భారీ తగ్గుదల నమోదవుతుందని తెలిపింది. అంతే కాకుండా జపాన్, రష్యాలోనూ జనాభా భారీగా పెరుగుతోందని తెలిపింది. 2024-54 మధ్య చైనా జనాభా 20 కోట్లు, రాష్యా జనాభా కోటి తగ్గనుంది, కానీ 2100 నాటికి చైనా జనాభా78.6 కోట్లు తగ్గి 63 కోట్లకే పరిమితం కానుందని వెల్లడించింది.

సంతాన సాఫల్యత రేటు పడిపోవడమే కారణం:
2024లో 820 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా 2080లో గరిష్టానికి చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. వచ్చే 50 నుంచి 60 ఏళ్ళలో ప్రపంచ జనాభా 1030 కోట్ల వద్ద గరిష్టానికి చేరుకుంటుందని వెల్లడించింది. అనంతరం తగ్గుతూ 1020 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. సంతాన సాఫల్యత రేటు గణనీయంగా పడిపోవడమే జనాభా తగ్గడానికి కారణం ఐక్యరాజ్యసమితి వివరించింది. చైనాలో సగటున ఒక్కో మహిళ తమ జీవిత కాలంలో ఒకరికి మాత్రమే జన్మిస్తున్నట్లు వెల్లడించింది.

Advertisement

Also Read: మళ్లీ తడబడిన జోబైడెన్.. ఈసారి ఏమన్నారంటే..?

సంతాన సాఫల్యత రేటు 2.1 ఉండాలని, అప్పుడే ప్రస్తుత జనాభా అలాగే కొనసాగుతుందని ఐరాస తెలిపింది 1.8 లేదా 1.5 కంటే తక్కువకు చేరితే జనాభా గణనీయంగా పడిపోతుందని పేర్కొన్నారు. చైనా సహా మరికొన్ని దేశాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతుందని వివరించింది.

Related News

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

Big Stories

Advertisement
×