E-Paper
Advertisement

CM Revanth Reddy: గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్.. దశాబ్ది వేడుకలకు ఆహ్వానం

CM Revanth Reddy: గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్.. దశాబ్ది వేడుకలకు ఆహ్వానం
Advertisement

CM Revanth Reddy: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్ ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసారు. రేపు జరగబోయే దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్ ను సీఎం ఆహ్వానించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకులను జూన్ 2న పరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీ రానున్నారు.

రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వం గవర్నర్ రాధాకృష్ణన్ ను ఆహ్వానించింది. దశాబ్ది వేడుకల కోసం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పరేడ్ గ్రౌండ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై ఉత్సవాలను వైభంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాల కళా బృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

ఉదయం నుంచి రాత్రి వరకు దశాబ్ది ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉదయం 9.30కు గన్ పార్క్ అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ సాధనలో అమరులైన వారికి సీఎం నివాళులు అర్పిస్తారు. అనంతరం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ట్యాంక్ బండ్ పై సాయంత్రం తెలంగాణ దశాబ్ది వేడుకలు ప్రారంభం అవుతాయి.

Also Read: తెలంగాణ ఆవిర్భావ వేడుకల పూర్తి వివరాలు.. ఇవే

Advertisement

తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, వివిధ రకాల ఉత్పత్తులు, పుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ కళా రూపాలపై కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం జయ జయహే తెలంగాణ పూర్తి గీతాన్ని విడుదల చేస్తారు. 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఫైర్ వర్క్స్ తో వేడుకలు ముగుస్తాయి.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×