E-Paper
Advertisement

CM Revanth Reddy: గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్.. దశాబ్ది వేడుకలకు ఆహ్వానం

CM Revanth Reddy: గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్.. దశాబ్ది వేడుకలకు ఆహ్వానం
Advertisement

CM Revanth Reddy: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్ ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసారు. రేపు జరగబోయే దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్ ను సీఎం ఆహ్వానించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకులను జూన్ 2న పరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీ రానున్నారు.

రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వం గవర్నర్ రాధాకృష్ణన్ ను ఆహ్వానించింది. దశాబ్ది వేడుకల కోసం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పరేడ్ గ్రౌండ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై ఉత్సవాలను వైభంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాల కళా బృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

ఉదయం నుంచి రాత్రి వరకు దశాబ్ది ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉదయం 9.30కు గన్ పార్క్ అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ సాధనలో అమరులైన వారికి సీఎం నివాళులు అర్పిస్తారు. అనంతరం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ట్యాంక్ బండ్ పై సాయంత్రం తెలంగాణ దశాబ్ది వేడుకలు ప్రారంభం అవుతాయి.

Also Read: తెలంగాణ ఆవిర్భావ వేడుకల పూర్తి వివరాలు.. ఇవే

Advertisement

తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, వివిధ రకాల ఉత్పత్తులు, పుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ కళా రూపాలపై కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం జయ జయహే తెలంగాణ పూర్తి గీతాన్ని విడుదల చేస్తారు. 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఫైర్ వర్క్స్ తో వేడుకలు ముగుస్తాయి.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×