E-Paper
Advertisement

Telugu Student Dies in USA: తీవ్ర విషాదం.. అమెరికాలో బాపట్ల విద్యార్థిని మృతి

Telugu Student Dies in USA: తీవ్ర విషాదం.. అమెరికాలో బాపట్ల విద్యార్థిని మృతి
Advertisement

Telugu Student Dies in USA: అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏపీకి చెందిన ఓ యువతి ఉద్యోగానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. ఒంగోలు జిల్లా బాపట్లలోని కారంచేడు గ్రామానికి చెందిన యారగడ్డ రామకృష్ణ, నాగమణి దంపతుల కుమార్తె రాజ్యలక్ష్మి. టెక్సాస్‌లో ఎం అండ్ ఎం యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసింది. అనంతరం ఉద్యోగం కోసం ప్రయత్నించే క్రమంలో అనారోగ్యానికి గురైంది. మూడు రోజులుగా జలుబు ఆయాసంతో బాధపడుతుంది. డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించింది. అయితే ఈ నెల తొమ్మిదిన డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకోగా గురువారం రాత్రి నిద్రలోనే కన్ను మూసింది. రాజ్యలక్ష్మి డెడ్ బాడీని ఇండియాకు తీసుకొచ్చేందుకు విరాళాలు సేకరిస్తున్నారు స్నేహితులు, కుటుంబ సభ్యులు. ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగు పెట్టి ఉన్నత ఉద్యోగాలు చేస్తాది అనుకున్న తన కుమార్తె ఇలా విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Related News

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

22A భూములపై పొలిటికల్‌ వార్‌..!

సెక్రటీరియట్‌లో లంచావతారాలు..!

తెగిపడిన పోతిరెడ్డిపాడు గేట్.. జలపోరు మళ్లీ షురూ!

బాబు మార్క్ పాలన.. ముందుగానే ప్రజలకు సంక్షేమ క్యాలెండర్!

సర్వే సమరం.. ప్రజలు ఎవరివైపు..?

జనసేనలోకి బడా నేతలకు దారేది?

Big Stories

Advertisement
×