E-Paper
Advertisement

Cm Revanth Reddy: నా ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌ను.. అది ఫార్మాసిటీ కాదు ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్.. వామ‌ప‌క్ష నేత‌ల‌తో సీఎం

Cm Revanth Reddy: నా ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌ను.. అది ఫార్మాసిటీ కాదు ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్.. వామ‌ప‌క్ష నేత‌ల‌తో సీఎం
Advertisement

Cm Revanth Reddy: ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న నేప‌థ్యంలో క‌మ్యూనిస్టు పార్టీల నేత‌లు సీఎం రేవంత్ రెడ్డితో స‌చివాల‌యంలో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ల‌గ‌చ‌ర్లలో తాము ప‌ర్య‌టించి ప‌రిశీలించిన విష‌యాల‌ను సీఎం దృష్టికి తీసుకునివెళ్లారు. అక్క‌డ రెండు పంట‌లు పండే భూములు ఉన్నాయ‌ని సీఎంకు చెప్పారు. రైతుల‌ను ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని అన్నారు. రైతుల త‌ర‌ఫున విన‌తీప‌త్రాన్ని అంద‌జేశారు. దీంతో సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను నేనే ఎందుకు ఇబ్బంది పెడ‌తాన‌ని సీఎం వారితో చెప్పారు.

Also read: షిండే, అజిత్ పవార్‌ల వెంటే మహా ప్రజలు.. పార్టీలను చీల్చినా ఎందుకింత క్రేజ్

Advertisement

కొడంగల్ ఓ ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాద‌ని, ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ అని వివ‌రించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని యువ‌త‌, మ‌హిళ‌ల‌కు ఉపాధి క‌ల్పించ‌డ‌మే త‌న ఉద్దేశమ‌ని తెలిపారు. కాలుష్య ర‌హిత ప‌రిశ్ర‌మ‌లే ఏర్పాటు చేస్తామ‌ని, భూసేక‌ర‌ణ ప‌రిహారం పెంపును ప‌రిశీలిస్తామ‌ని హామీ ఇచ్చారు. ల‌గ‌చ‌ర్ల‌లోని భూముల‌నే తీసుకోవాల‌ని లేద‌ని ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలిపారు. రైతుల బాధ‌లు త‌న‌కు తెలుసని, త‌ను కూడా రైతు కుటుంబం నుండే వ‌చ్చాన‌ని అన్నారు. అమాయక రైతులపై కేసుల విషయం లో పరిశీలిస్తామ‌ని చెప్పారు. కుట్ర చేసిన వాళ్ళను వదిలిపెట్టమ‌ని హెచ్చ‌రించారు.

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా చాలా వెన‌క‌బ‌డింద‌ని యువ‌త‌కు ఉపాధి లేక ఇబ్బంది ప‌డుతున్నార‌ని సీఎం క‌మ్యూనిస్టుల నేత‌ల‌కు చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసేందుకే ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. భూముల సేక‌ర‌ణ‌లో మార్పులు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. వామ‌ప‌క్ష నేత‌లు ఇచ్చిన రిపోర్టును ప‌రిశీలిస్తామ‌ని సీఎం తెలిపారు. మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వం కుట్ర చేస్తున్నాయ‌ని నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

Related News

బుల్లెట్ ట్రైన్ హబ్‌కు హైకోర్టు బ్రేక్.. బహదూర్ గూడ రైతులకు బిగ్ రిలీఫ్!

CMO Report: సీఎం రేవంత్ బ్లాక్ లిస్ట్‌లో 26 మంది ఎమ్మెల్యేలు.. అక్కడ కాంగ్రెస్ దుకాణం బంద్?

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోరం.. పోలీస్ స్టేషన్‌లో భార్యపై భర్త కత్తితో దాడి!

తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. సీక్రేట్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్..?

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

Big Stories

Advertisement
×