E-Paper
Advertisement

KCR Convoy : కేసీఆర్ కాన్వాయ్ .. రూ. 66 కోట్ల.. 22 ల్యాండ్ క్రూయిజర్లు ..లోగుట్టు ఇదేనా?

KCR Convoy : కేసీఆర్ కాన్వాయ్ .. రూ. 66 కోట్ల.. 22 ల్యాండ్ క్రూయిజర్లు ..లోగుట్టు ఇదేనా?
Advertisement

KCR Convoy : మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయాలను వెల్లడించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 66 కోట్ల రూపాయలతో 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి వాటిని విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ విషయాన్ని తాను సీఎం అయిన పది రోజుల వరకు కూడా తెలియదన్నారు. అయితే ఓ అధికారి చెప్పడంతో ఈ కాన్వాయ్ కొనుగోలు గురించి తెలిసిందని రేవంత్ రెడ్డి వెల్లడించడం అందరిని షాక్ కి గురి చేసింది.

మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉండగా తన కాన్వాయ్ కోసం 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి వాటికి బులెట్ ఫ్రూఫ్, శాటిలైట్ టెక్నాలజీ హంగులు.. చేయించేందుకు ఏపీలో గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని త్రిహయని ఇంజనీరింగ్‌ వర్క్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కు సీక్రెట్‌గా తరలించారు. అయితే ఊహించని రీతిలో ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురవ్వడంతో ఆ విషయాన్ని గుట్టుచప్పుడుగా ఉంచారు. అయితే జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ ఆయన పొరుగు రాష్ట్రాల్లో పర్యటించేందుకు ఈ స్పెషల్ కాన్వాయ్ ను దాచిపెట్టారని భావిస్తున్నారు.

Advertisement

ఈ కాన్వాయ్ వ్యవహరంపై విచారణ చేపట్టిన అధికారులు.. త్వరలోనే సంబంధిత వివరాలను బయటపెట్టేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే ఆ అంశంపై ఏపీలోని అధికారులతో కూడా మాట్లాడి సదరు కంపెనీ ప్రతినిధితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కార్లను హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నారని సమాచారం అందుతుంది.

Tags

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×