Big Stories

CM Revanth reddy: బీఆర్ఎస్ కు ఓటు వేస్తే.. మూసీలో వేసినట్లే: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth reddy comments on BRS(Telangana politics): లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా వరుస పర్యటనలతో ప్రచారం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్మల్, ఎర్రవల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం స్థానిక అభ్యర్థులకు మద్దుతుగా ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు.

- Advertisement -

బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిందేమీ లేదన్నారు. తుక్కుగూడ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం ప్రసంగించారు. మరో పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read: రాజ్యాంగం మారితే జరిగేది అదే : నిర్మల్ సభలో రాహుల్ గాంధీ

బీఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి బీజేపీకి ఓటు వేయాలని చెబుతున్నారని ఆరోపించారు. ఆమె గెలిచిన పార్టీని కాదని మరో పార్టీకి ఓటు వేయాలని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. మరో పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. 2024 వరకూ ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అన్నారు. తుక్కుగూడ నియోకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News