BigTV English

CM Revanth Reddy Delhi Tour : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. కేంద్ర మంత్రులకు వినతులు..

CM Revanth Reddy Delhi Tour : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. కేంద్ర మంత్రులకు వినతులు..

CM Revanth Reddy Delhi Tour : రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలే అజెండాగా సీఎం రేవంత్‌రెడ్డి రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి.. వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సమావేశం అయ్యారు. తెలంగాణకు సైనిక్ స్కూల్ కేటాయించాలని సీఎం కేంద్రమంత్రిని కోరారు.


కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో రేవంత్‌ బృందం సమావేశమైంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులపైనా నేతలు చర్చించారు.

కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమై వేర్వేరు పద్దుల కింద రాష్ట్రానికి రావలసిన 2వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరారు. రెండు రోజుల పర్యటన తర్వాత రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×