BigTV English

Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కిడ్నాప్.. రూ.50లక్షలు డిమాండ్‌ .. చివరికి ఏమైందంటే?

Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కిడ్నాప్.. రూ.50లక్షలు డిమాండ్‌ .. చివరికి ఏమైందంటే?

Hyderabad: రాయదుర్గం పోలీస్‌‌స్టేషన్‌ పరిధిలో కూకట్‌పల్లికి చెందిన సురేందర్ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కిడ్నాప్‌కి గురి అయ్యాడు. కిడ్నాపర్లు ఈ విషయాన్ని బాధితుడి భార్యకు ఇంటర్నెట్‌ ద్వారా కాల్స్‌ చేసి తెలిపారు. సురేందర్‌ని విడుదల చేయాలంటే రూ.50 లక్షలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడి భార్య పోలీసు‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం సాయంత్రం కారులో వచ్చిన దుండగులు రాయదుర్గం కమిషనరేట్‌ కార్యాలయం పక్కనే ఉన్న కేర్‌ ఆసుపత్రి వద్ద సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఎత్తుకెళ్లారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలోనే కిడ్నాప్‌కి గురి అయ్యాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో పోలీసులను చూసి కిడ్నాపర్లు పారిపోయారు. సురేందర్‌ని కిడ్నాపర్లు చెర నుంచి కాపాడారు. కిడ్నాప్ గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×