E-Paper
Advertisement

Wanaparthy : సీఎం రేవంత్‌‌పై అభిమానం.. కాలినడకన శ్రీశైలానికి యువకుడు..

Wanaparthy : సీఎం రేవంత్‌‌పై అభిమానం.. కాలినడకన శ్రీశైలానికి యువకుడు..
Advertisement

Wanaparthy : రేవంత్‌ రెడ్డి సీఎం కావాలనే కోరిక నెరవేరినందున మొక్కు చెల్లించేందుకు బయల్దేరాడు ఓ యువకుడు. వనపర్తి నుంచి శ్రీశైలం వరకు పాదయాత్రగా వెళ్తున్నాడు. ఈ నెల 7న ప్రారంభమైన ఈ నడక ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చేరుకుంది. ఎన్ని కష్టాలు పడైనా సరే తన మొక్కును చెల్లించుకుంటా అంటున్నాడు ఆ యువకుడు.

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానయపల్లికి చెందిన రాజు సీఎం రేవంత్‌కు వీరాభిమాని. ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని శ్రీశైల మల్లికార్జునుడికి మొక్కుకున్నాడు. ఆ తర్వాత వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్‌ విజయం సాధించడం… ఆ తర్వాత రేవంత్‌ సీఎం కావడం చకచకా జరిగిపోయాయి. దీంతో తన కోరిక తీరినందుకు మొక్కు చెల్లించేందుకు శ్రీశైలానికి బయల్దేరాడు రాజు. కానాయపల్లి నుంచి కాలినడకన రేవంత్‌ ఫోటో పట్టుకొని వెళ్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు పడైనా సరే శ్రీశైలానికి చేరుకుంటానని చెప్తున్నాడు రాజు.

Advertisement

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×