E-Paper
Advertisement

Wanaparthy : సీఎం రేవంత్‌‌పై అభిమానం.. కాలినడకన శ్రీశైలానికి యువకుడు..

Wanaparthy : సీఎం రేవంత్‌‌పై అభిమానం.. కాలినడకన శ్రీశైలానికి యువకుడు..
Advertisement

Wanaparthy : రేవంత్‌ రెడ్డి సీఎం కావాలనే కోరిక నెరవేరినందున మొక్కు చెల్లించేందుకు బయల్దేరాడు ఓ యువకుడు. వనపర్తి నుంచి శ్రీశైలం వరకు పాదయాత్రగా వెళ్తున్నాడు. ఈ నెల 7న ప్రారంభమైన ఈ నడక ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చేరుకుంది. ఎన్ని కష్టాలు పడైనా సరే తన మొక్కును చెల్లించుకుంటా అంటున్నాడు ఆ యువకుడు.

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానయపల్లికి చెందిన రాజు సీఎం రేవంత్‌కు వీరాభిమాని. ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని శ్రీశైల మల్లికార్జునుడికి మొక్కుకున్నాడు. ఆ తర్వాత వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్‌ విజయం సాధించడం… ఆ తర్వాత రేవంత్‌ సీఎం కావడం చకచకా జరిగిపోయాయి. దీంతో తన కోరిక తీరినందుకు మొక్కు చెల్లించేందుకు శ్రీశైలానికి బయల్దేరాడు రాజు. కానాయపల్లి నుంచి కాలినడకన రేవంత్‌ ఫోటో పట్టుకొని వెళ్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు పడైనా సరే శ్రీశైలానికి చేరుకుంటానని చెప్తున్నాడు రాజు.

Advertisement

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×