Big Stories

CM Revanth Reddy: ‘ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. హైటెన్షన్ కరెంట్ వైర్.. బిడ్డా టచ్ చేసి చూడు’..

CM Revanth Reddy Medak Road Show: వచ్చే పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పని అయిపోయిందని అన్నారు. మెదక్ కు ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్పు బీఆర్ఎస్, బీజేపీ చేసిందేం లేదన్నారు.

- Advertisement -

దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడి ప్రజలు మెదక్ గడ్డపై ఇందిరమ్మను గెలిపించారని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు గుర్తుచేశారు. 1999 నుంచి 2024 వరకు 25 సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ బీజేపీ, బీఆరెఎస్ చేతిలోనే ఉందన్నారు. ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప.. బీజేపీ, బీఆరెఎస్ ఈ ప్రాంతానికి చేసిందేం లేదని విమర్శించారు. పదేళ్ల బీఆరెఎస్ పాలనలో మెదక్ ప్రజలకు ఒరిగిందేం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

‘దుబ్బాకలో గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తానన్న రఘునందన్ రావును అడుగుతున్నా.. మేమంతా బస్సులేసుకుని దుబ్బాక వస్తాం. నువ్వు తెచ్చిన నిధులేంటో.. చేసిన అభివృద్ధి ఏంటో చూపించు. పదేళ్లు మోదీ ప్రధానిగా ఉన్నారు. కేసీఆర్ సీఎం గా ఉన్నారు. ఈ పదేళ్లలో వీళ్లు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని? చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాకే ఓట్లు అడగాలి.

Also Read: Kalvakuntla Kanna Rao: కన్నారావు అక్రమాలు అన్నీ ఇన్నీ కావు..

కేసీఆర్ పని అయిపోయింది.. కారు కార్ఖానాకు పోయింది. ఇక కారును తుక్కు కింద అమ్మాల్సిందే. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని పిట్టలదొర కేసీఆర్ అంటుండు.. అదేమైనా నువు తాగే ఫుల్ బాటిలా అయిపోవడానికి. ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. హైటెన్షన్ కరెంట్ వైర్.. బిడ్డా టచ్ చేసి చూడు.. చూస్తూ ఊరుకోవడానికి నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదు.. మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా జాగ్రత్త’ అంటూ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లిడించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించే ప్రజా పాలన కాంగ్రెస్ సొంతం అని తెలిపారు. రూ.22,500 కోట్లతో పేదలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తున్నాం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటున్నాం అని అన్నారు. తాము ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూస్తుంటే.. కడుపు మండిన మోదీ, కేసీఆర్ కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా.. ప్రధానిగా రాహుల్ గాంధీ: సీఎం రేవంత్ రెడ్డి

‘కాంగ్రెస్ పేదల కోసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంటే.. చూసి ఓర్వలేక కేసీఆర్, మోదీ కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రైతులకు ఏడు పాయల దుర్గమ్మ సాక్షిగా మాట ఇస్తున్నా.. ఆగస్టు 15వ తేదీలోగా రూ.2లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది. వచ్చే పంటకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్, హరీష్ హామీలు నెరవేర్చలేదు. కానీ, వందరోజుల్లోనే మమ్మల్ని దిగిపొమ్మంటున్నారు. పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయం’ అని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ప్రతీ పేదవాడికి సంక్షేమ ఫలాలను అందించే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు. మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ రైతుల భూములు గుంజుకున్న దుర్మార్గుడు బీఆరెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అని ఫైర్ అయ్యారు. మోదీ, కేడీ తొడుదొంగలు.. గూడుపుఠాని.. డిసెంబర్‌లో కేడీని ఇంటికి పంపించాం.. ఇక ఇప్పుడు మోదీని ఇంటికి పంపించాలి. పేదవాడికి అండగా నిలబడేది ఈ మూడు రంగుల జెండానే.. బలహీన వర్గాల బిడ్డ నీలం మధును గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు కోరారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News