E-Paper
Advertisement

CM Revanth Reddy: విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం

CM Revanth Reddy: విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం
Advertisement

CM Revanth Reddy: తెలంగాణలో SPDCL, NPDCL‌తోపాటు మరో డిస్కం ఏర్పాటు ప్రతిపాదనల నేపథ్యంలో.. ప్రాథమిక ప్రణాళికను ఇంధన శాఖ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు. వ్యవసాయం, మేజర్-మైనర్ లిప్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్‌ఎంసీ నీటి సరాఫరాలను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

ప్రతిపాదనల నేపథ్యంలో ప్రణాళిక సిద్ధం చేసిన ఆఫీసర్స్
మూడో డిస్కంకు సంబంధించిన పీపీఏ ఏర్పాటు, సిబ్బంది, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై అధికారులకు సీఎం సూచనలు చేశారు. కొత్త డిస్కం ఏర్పాటుపై కేబినెట్ ఆమోదం తర్వాత ఏర్పాటుపై ముందుకెళ్లాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. అప్పటిలోగా పూర్తిస్థాయి ప్రణాళికను సిద్దం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Advertisement

గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీలో నీటి సరఫరాకు.. ప్రతిపాదనలు
గ్రేటర్ హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై పలు ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు. డీపీఆర్ తయారీ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్‌తో పాటు ముందుగా కోర్ అర్బన్ రీజియన్‌లో విద్యుత్ సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఓవర్ లోడ్ సమస్య తలెత్తకుండా రీప్లేస్మెంట్ చర్యలు చేపట్టాలన్నారు. సబ్ స్టేషన్ కెపాసిటీ కంటే ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకో వాలని స్పష్టం చేశారు. అవసరమైన చోట సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.

కేబినెట్ ఆమోదం తర్వాత.. కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకెళ్లాలన్న సీఎం రేవంత్ రెడ్డి
కోర్ అర్బన్ రీజియన్లో ఎక్కడెక్కడ కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల అవసరం ఉందో గుర్తించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అర్బన్ ఏరియాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లలో అధునా తన సాంకేతికను ఉపయోగించాలన్నారు. విద్యుత్ కేబుల్స్ పాటు ఇతర కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ ఉపయోగించుకునేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Advertisement

Also Read: తెలుగు రాష్ట్రాలకు బిగ్‌షాక్.. మరో మూడు రోజులు భారీ వర్ష సూచన..

పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు
బెంగుళూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. డిసెంబర్‌లోగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థా యి ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే రెండున్నరేళ్లలో కోర్ అర్బన్ రీజియన్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×