E-Paper
Advertisement

CM Revanth Reddy: విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం

CM Revanth Reddy: విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం

CM Revanth Reddy: తెలంగాణలో SPDCL, NPDCL‌తోపాటు మరో డిస్కం ఏర్పాటు ప్రతిపాదనల నేపథ్యంలో.. ప్రాథమిక ప్రణాళికను ఇంధన శాఖ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు. వ్యవసాయం, మేజర్-మైనర్ లిప్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్‌ఎంసీ నీటి సరాఫరాలను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

ప్రతిపాదనల నేపథ్యంలో ప్రణాళిక సిద్ధం చేసిన ఆఫీసర్స్
మూడో డిస్కంకు సంబంధించిన పీపీఏ ఏర్పాటు, సిబ్బంది, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై అధికారులకు సీఎం సూచనలు చేశారు. కొత్త డిస్కం ఏర్పాటుపై కేబినెట్ ఆమోదం తర్వాత ఏర్పాటుపై ముందుకెళ్లాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. అప్పటిలోగా పూర్తిస్థాయి ప్రణాళికను సిద్దం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీలో నీటి సరఫరాకు.. ప్రతిపాదనలు
గ్రేటర్ హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై పలు ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు. డీపీఆర్ తయారీ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్‌తో పాటు ముందుగా కోర్ అర్బన్ రీజియన్‌లో విద్యుత్ సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఓవర్ లోడ్ సమస్య తలెత్తకుండా రీప్లేస్మెంట్ చర్యలు చేపట్టాలన్నారు. సబ్ స్టేషన్ కెపాసిటీ కంటే ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకో వాలని స్పష్టం చేశారు. అవసరమైన చోట సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.

కేబినెట్ ఆమోదం తర్వాత.. కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకెళ్లాలన్న సీఎం రేవంత్ రెడ్డి
కోర్ అర్బన్ రీజియన్లో ఎక్కడెక్కడ కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల అవసరం ఉందో గుర్తించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అర్బన్ ఏరియాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లలో అధునా తన సాంకేతికను ఉపయోగించాలన్నారు. విద్యుత్ కేబుల్స్ పాటు ఇతర కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ ఉపయోగించుకునేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Also Read: తెలుగు రాష్ట్రాలకు బిగ్‌షాక్.. మరో మూడు రోజులు భారీ వర్ష సూచన..

పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు
బెంగుళూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. డిసెంబర్‌లోగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థా యి ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే రెండున్నరేళ్లలో కోర్ అర్బన్ రీజియన్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.

Related News

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Big Stories

×