E-Paper
Advertisement

CM Revanth with Janareddy: జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ, కీలక అంశాలపై చర్చ

CM Revanth with Janareddy: జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ, కీలక అంశాలపై చర్చ
Advertisement

CM Revanth with Janareddy: తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ కగార్ ఎంతవరకు వచ్చింది? ఆ ప్రాంతంలో కీలక మావోయిస్టులు ఉన్నారా? ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కేసీఆర్ ఎందుకన్నారు? తనపై ఉన్న అపవాదు పొగొట్టుకునేందుకు ఆయన ఈ స్కెచ్ వేశారా? తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ వెనుక అసలేం జరుగుతోంది? ఇదే చర్చ తెలంగాణ అంతటా నెలకొంది.

తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో వారం రోజులుగా మావోయిస్టుల కోసం ఆపరేషన్ కగార్ చేపట్టింది కేంద్రం. ఈ ఆపరేషన్‌లో పదుల సంఖ్యలో మావోలు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. పౌర సంఘాల హక్కుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఎలాగైనా ఆపరేషన్‌ ఆపాలని ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఓ వినతి పత్రాన్ని అందజేశారు. సామాజిక కోణంలో నక్సలిజాన్ని చూస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

Advertisement

ఆదివారం వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో జరిగింది. అందులో ఆపరేషన్ కగారు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు మాజీ సీఎం కేసీఆర్.  ఈ ఆపరేషన్ కేంద్రం నిలిపి వేయాలని పిలుపునిచ్చారు.  బలం ఉందని చంపడం సరికాదని, మావోలతో చర్చలు జరపాలని అన్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇరువురు మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.  అందులో గుట్టలో జరుగుతున్న ఆపరేషన్ కగార్, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో చర్చించినట్టు సమాచారం. సీఎం వెంట ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

Advertisement

ALSO READ: జగన్ దారిలో కేసీఆర్.. మేం రెడీ అంటున్న మంత్రులు

గతంలో ఉమ్మడి ఏపీలో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం మావోలతో శాంతి చర్చలు జరిపింది. దీని వెనుక అప్పట్లో జానారెడ్డి కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆయనను సీఎం రేవంత్‌రెడ్డి కలిసి సలహాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మావోల అంశంపై సానుకూలంగా స్పందించడంతో పౌర హక్కుల సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాల్పులు నిలిపివేసి వారితో చర్చలు జరిపితే సమస్య ఓ కొలిక్కి వస్తుందని అంటున్నారు.  కేవలం ప్రభుత్వం వైపు నుంచి కాకుండా  కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పౌర హక్కుల సంఘాలు, మేధావులు, కమ్యూనిస్టులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  మావోల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుందో కొద్దిరోజుల్లో తేలనుంది.

 

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×