CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో పర్యటించి బిగ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ చైర్మన్ వెన్నం విజయ్కాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవేందర్ రెడ్డి మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విజయ్కాంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలను ఓదార్చి ధైర్యం చెప్పారు. రాఘవేందర్ రెడ్డి మరణం ఆ కుటుంబానికే కాకుండా గ్రామానికి కూడా తీరని లోటు అని మంత్రులు పేర్కొన్నారు. ఒక సాధారణ రైతుగా ఉంటూ కుమారులను ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన ఆయన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
విషాదంలో ఉన్న వెన్నం కుటుంబానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో ముఖ్యమంత్రితో పాటు కీలక మంత్రులు ఉండటంతో రెడ్యాల గ్రామంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాఘవేందర్ రెడ్డికి నివాళులర్పించారు.
కాంగ్రెస్ నాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, బిగ్ టీవీ ఛైర్మన్ వెన్నం విజయ్కాంత్ రెడ్డి తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy paid tributes to Vennam Raghavendra Reddy, father of Congress leaders Vennam Srikanth Reddy and Big TV… pic.twitter.com/xqhx54RAPn
— BIG TV Breaking News (@bigtvtelugu) February 22, 2026