E-Paper
Advertisement

Telangana Assembly: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం.. ఆమోదం తెలిపిన సభ

Telangana Assembly: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం.. ఆమోదం తెలిపిన సభ
Advertisement

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతల కౌంటర్, ప్రతి కౌంటర్లతో శాసన సభ దద్దరిల్లిపోతుంది. ఈసారి బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయాలి.. అలా చేస్తే తాము కూడా మద్దతిస్తామంటూ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తప్పకుండా జంతర్ మంతర్ దగ్గర దీక్షకు కూర్చుందాం. దీక్షకు విపక్ష నేతగా కేసీఆర్ కూడా రావాలి. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చామని మేం చెప్పలేదు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా అందరం దీక్ష చేద్దాం. సచ్చుడో లేదా తెలంగాణకు నిధులు తెచ్చుడో చూద్దాం’ అంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.

అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘కేంద్ర బడ్జెట్ తెలంగాణను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రధానిని ఎన్నో అడిగాం.. ఒక్కటీ ఇవ్వలేదు. సభను ప్రతిపక్షం తప్పుదారి పట్టిస్తోంది. ప్రశ్నోత్తరాల తరువాత తీర్మానం ఉంటుందని చెప్పాం. మేం అంశాన్ని ముందే చెప్పి చర్చకు పెట్టాం. బడ్జెట్ పై నిరాశతోనే ఇవాళ చర్చ పెట్టాం. మా ప్రతిపాదనలు కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణ దేశంలో భాగం కాదా? ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరించింది. కేంద్రం తీరుతో రాష్ట్రాలన్నీ ఆలోచనలో పడ్డాయి. తెలంగాణను కేంద్రం గాలికి వదిలేసింది. బీజేపీతో కలిసి తిరిగింది బీఆర్ఎస్సే. లక్షలాది ఎకరాలు మునగడానికి కారణం బీఆర్ఎస్సే. 7 మండలాల కోసం బీఆర్ఎస్ పోరాడలేదు. సీతారామ ప్రాజెక్టును కట్టింది బీఆర్ఎస్ కాదు’ అంటూ భట్టి పేర్కొన్నారు.

Advertisement

కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

ఇదిలా ఉంటే.. కేంద్ర బడ్జెట్ పై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మాన కాపీలను సభ్యులందరికీ అందజేశారు. అనంతరం ఆ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపరిచారు. గడిచిన పదేళ్ల ఆ చట్టాలను అమలు చేయలేదు. గత ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేదు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిశాం. తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించాం. రాష్ట్రాలకు పెద్దన్నలాగా వ్యవహరించాలని కోరాం. కేంద్రానిది తెలంగాణపై వివక్ష కాదు.. కక్ష’ అంటూ రేవంత్ పేర్కొన్నారు.

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు, ట్రీట్‌మెంట్ చేస్తున్న వైద్యులు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×