E-Paper
Advertisement

Hyderabad News: బాలుడిపై కుక్కలు దాడి ఘటన, సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం, అధికారులకు ఆదేశాలు

Hyderabad News: బాలుడిపై కుక్కలు దాడి ఘటన, సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం, అధికారులకు ఆదేశాలు
Advertisement

Hyderabad News: హయత్‌నగర్‌లో మూగ బాలుడిపై వీధి కుక్కలు దాడి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన తక్షణ సాయం అందించాలని సూచించారు.

బాలుడిపై కుక్కలు దాడి ఘటన

Advertisement

హయత్‌నగర్‌లోని శివగంగ కాలనీలో మూగబాలుడి ప్రేమ్‌చంద్‌పై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ వార్త గురించి స్పందించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. దీనికి సంబంధించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచన చేశారు.

అలాగే వీధి కుక్కల కట్టడి కోసం వెంటనే చర్యలు అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు-చంద్రకళ దంపతులు హయత్‌నగర్‌లోని శివగంగ కాలనీలో ఉంటున్నారు. ఈ దంపతులకు కొడుకు ప్రేమ్‌చంద్‌ ఉన్నాడు. పుట్టుకతో బాలుడు మూగ.

Advertisement

సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం, అధికారులకు ఆదేశాలు

మంగళవారం ఆ బాలుడిపై 15 నుంచి 20 వీధి కుక్కలు ఒకేసారి తరుముతూ దాడి చేశాయి. బాలుడి దుస్తులు కొరికేసి మరీ దారుణంగా కరిచాయి. కుక్కల దాడిని గమనించిన ఓ స్థానికుడు కర్ర సాయంతో వాటిని బెదిరించాడు. వెంటనే 108 కు సమాచారం ఇచ్చారు. గాయపడిన బాలుడ్ని నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రి తీసుకున్నారు పేరెంట్స్.

ఆ తర్వాత వైద్యుల సూచనతో నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వార్డులో ఉంచి బాలుడికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కుక్కల దాడిలో బాలుడి చెవి తెగినట్టు తెలుస్తోంది. తల, నడుము, వీపు భాగంలో గాయాలయినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ALSO READ: తెలంగాణ జోలికొస్తే ఎవరైనా సరే.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఘాటు వార్నింగ్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆసుపత్రిలో ఉన్న బాలుడ్ని పరామర్శించిన జీహెచ్ఎంసీ కమిషనర్, వెటర్నరీ అధికారులు. వీధి కుక్కలపై స్పెషల్ డ్రైవ్ కొనసాగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో వీధి కుక్కల దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణాన్.

మంగళవారం వీధి కుక్కల దాడి వ్యవహారంపై జీహెచ్ఎంసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాటి సంరక్షణకు మార్గదర్శకాలు పాటించాలని పేర్కొంది. ఇకపై చురుగ్గా వ్యవహరించాలని నొక్కి వక్కానించింది హైకోర్టు.

 

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×