E-Paper
Advertisement

Hyderabad News: బాలుడిపై కుక్కలు దాడి ఘటన, సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం, అధికారులకు ఆదేశాలు

Hyderabad News: బాలుడిపై కుక్కలు దాడి ఘటన, సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం, అధికారులకు ఆదేశాలు

Hyderabad News: హయత్‌నగర్‌లో మూగ బాలుడిపై వీధి కుక్కలు దాడి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన తక్షణ సాయం అందించాలని సూచించారు.

బాలుడిపై కుక్కలు దాడి ఘటన

హయత్‌నగర్‌లోని శివగంగ కాలనీలో మూగబాలుడి ప్రేమ్‌చంద్‌పై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ వార్త గురించి స్పందించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. దీనికి సంబంధించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచన చేశారు.

అలాగే వీధి కుక్కల కట్టడి కోసం వెంటనే చర్యలు అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు-చంద్రకళ దంపతులు హయత్‌నగర్‌లోని శివగంగ కాలనీలో ఉంటున్నారు. ఈ దంపతులకు కొడుకు ప్రేమ్‌చంద్‌ ఉన్నాడు. పుట్టుకతో బాలుడు మూగ.

సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం, అధికారులకు ఆదేశాలు

మంగళవారం ఆ బాలుడిపై 15 నుంచి 20 వీధి కుక్కలు ఒకేసారి తరుముతూ దాడి చేశాయి. బాలుడి దుస్తులు కొరికేసి మరీ దారుణంగా కరిచాయి. కుక్కల దాడిని గమనించిన ఓ స్థానికుడు కర్ర సాయంతో వాటిని బెదిరించాడు. వెంటనే 108 కు సమాచారం ఇచ్చారు. గాయపడిన బాలుడ్ని నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రి తీసుకున్నారు పేరెంట్స్.

ఆ తర్వాత వైద్యుల సూచనతో నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వార్డులో ఉంచి బాలుడికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కుక్కల దాడిలో బాలుడి చెవి తెగినట్టు తెలుస్తోంది. తల, నడుము, వీపు భాగంలో గాయాలయినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ALSO READ: తెలంగాణ జోలికొస్తే ఎవరైనా సరే.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఘాటు వార్నింగ్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆసుపత్రిలో ఉన్న బాలుడ్ని పరామర్శించిన జీహెచ్ఎంసీ కమిషనర్, వెటర్నరీ అధికారులు. వీధి కుక్కలపై స్పెషల్ డ్రైవ్ కొనసాగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో వీధి కుక్కల దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణాన్.

మంగళవారం వీధి కుక్కల దాడి వ్యవహారంపై జీహెచ్ఎంసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాటి సంరక్షణకు మార్గదర్శకాలు పాటించాలని పేర్కొంది. ఇకపై చురుగ్గా వ్యవహరించాలని నొక్కి వక్కానించింది హైకోర్టు.

 

Related News

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

Big Stories

×