BigTV English

CM Revanth Reddy : వాస్తవాలను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలి.. అధికారులకు సీఎం దిశానిర్దేశం..

CM Revanth Reddy : 2024-25 వార్షిక బడ్జెట్‌ వాస్తవికతను ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక శాఖపై సచివాలయంలో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాలపై ప్రజలకు వాస్తవాలు చెబుదామన్నారు.

CM Revanth Reddy : వాస్తవాలను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలి.. అధికారులకు సీఎం దిశానిర్దేశం..

CM Revanth Reddy : 2024-25 వార్షిక బడ్జెట్‌ వాస్తవికతను ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక శాఖపై సచివాలయంలో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాలపై ప్రజలకు వాస్తవాలు చెబుదామన్నారు.


తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్‌ తయారు చేయాలన్నారు. ప్రజా శ్రేయస్సే అంతిమ లక్ష్యంగా బడ్జెట్‌పై కసరత్తు జరగాలని సీఎం అధికారులకు సూచించారు. హామీల అమలుకు వ్యయ అంచనాలు పక్కాగా ఉండాలన్నారు. ప్రజలకు అర్థమయ్యేలా బడ్జెట్‌ రూపకల్పన జరగాలని సీఎం సూచించారు.

ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం స్ఫష్టంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్రానికి పేరు వస్తుందనే భేషజాలకు పోవద్దన్నారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా ఉన్న వాటినే సక్రమంగా వాడుకోవాలని అధికారులను సీఎం అధికారులకు సూచించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్‌ శాంతికుమారి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×