BigTV English
Advertisement

CM Revanth Reddy: ప్రముఖులతో చర్చించిన సీఎం రేవంత్.. రాజముద్ర ఫైనల్?

CM Revanth Reddy: ప్రముఖులతో చర్చించిన సీఎం రేవంత్.. రాజముద్ర ఫైనల్?

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రాజముద్ర తుది రూపు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమరవీరుల పోరాటం, త్యాగాలను గుర్తిచేసేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని సమాచారం. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో రాచరిక గుర్తులను చెరిపేస్తూ.. ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం 12 నమూనాలను తయారు చేయించారు. ఈ విషయమై ఇటీవల సీపీఐ, సీపీఎం నేతలతోపాటు పలువురు ఉద్యమకారులు, పార్టీ నేతలు, పలువురు అధికారులతోనూ సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.


Also Read: సోనియాతో ముగిసిన సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానం!

అయితే, ప్రస్తుత చిహ్నంలో అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చార్మినార్, మూడు సింహాలు, జాతీయ జెండాలోని మూడు రంగాలను కొనసాగిస్తూ.. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని కొన్నిరోజులుగా పలువురు సూచించినట్లు సమాచారం. రెండ్రోజుల క్రితం రుద్ర రాజేశంతో చర్చించిన సీఎం కొన్ని మార్పుల విషయాలను సూచించారు. ఈరోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి.. రుద్ర రాజేశం, డిప్యూటీ సీఎం విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫేసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ తోపాటు పలువురు ప్రముఖులతో సమీక్ష నిర్వహించారు. తుది రూపంపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ లోగోను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆవిష్కరించనున్నారు.


Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Big Stories

×