E-Paper
Advertisement

CM Revanth Reddy: ప్రముఖులతో చర్చించిన సీఎం రేవంత్.. రాజముద్ర ఫైనల్?

CM Revanth Reddy: ప్రముఖులతో చర్చించిన సీఎం రేవంత్.. రాజముద్ర ఫైనల్?
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రాజముద్ర తుది రూపు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమరవీరుల పోరాటం, త్యాగాలను గుర్తిచేసేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని సమాచారం. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో రాచరిక గుర్తులను చెరిపేస్తూ.. ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం 12 నమూనాలను తయారు చేయించారు. ఈ విషయమై ఇటీవల సీపీఐ, సీపీఎం నేతలతోపాటు పలువురు ఉద్యమకారులు, పార్టీ నేతలు, పలువురు అధికారులతోనూ సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.

Also Read: సోనియాతో ముగిసిన సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానం!

Advertisement

అయితే, ప్రస్తుత చిహ్నంలో అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చార్మినార్, మూడు సింహాలు, జాతీయ జెండాలోని మూడు రంగాలను కొనసాగిస్తూ.. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని కొన్నిరోజులుగా పలువురు సూచించినట్లు సమాచారం. రెండ్రోజుల క్రితం రుద్ర రాజేశంతో చర్చించిన సీఎం కొన్ని మార్పుల విషయాలను సూచించారు. ఈరోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి.. రుద్ర రాజేశం, డిప్యూటీ సీఎం విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫేసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ తోపాటు పలువురు ప్రముఖులతో సమీక్ష నిర్వహించారు. తుది రూపంపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ లోగోను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆవిష్కరించనున్నారు.

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×