E-Paper
Advertisement

CM Revanth Reddy: ఓఆర్ఆర్ హైదరాబాద్ కు లైఫ్ లైన్.. ఆర్థిక ప్రగతే లక్ష్యం

CM Revanth Reddy: ఓఆర్ఆర్ హైదరాబాద్ కు లైఫ్ లైన్.. ఆర్థిక ప్రగతే లక్ష్యం

CM Revanth Reddy Speech In CII Meet: తెలంగాణను ప్రగతి పథంలో నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన సీఐఐ తెలంగాణ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. పెట్టుబడులకు రక్షణ కల్పిస్తామని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. పరిశ్రమలు అభివృద్ధి చెందేలా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు పడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నాటి ప్రధాని
ఇందిరా గాంధీ ఐడీపీఎల్‌ను ప్రారంభించారని తెలిపారు. అందువల్లే హైదరాబాద్ లో ఫార్మా పరిశ్రమలు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఆ నాటి చర్యల వల్లే
హైదరాబాద్‌ అభివృద్ధి పథంలోకి వెళ్లిందన్నారు.

Read More: కొండగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి..

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు కీలకమని రేవంత్ రెడ్డి అన్నారు. అవుటర్‌ రింగు రోడ్డు అంశాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఓఆర్ఆర్ అవసరమా అని గతంలో చాలా మంది ప్రశ్నించారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ఓఆర్ఆర్ హైదరాబాద్ కు లైఫ్‌లైన్‌గా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×