E-Paper
Advertisement

CM Revanth Reddy: ఓఆర్ఆర్ హైదరాబాద్ కు లైఫ్ లైన్.. ఆర్థిక ప్రగతే లక్ష్యం

CM Revanth Reddy: ఓఆర్ఆర్ హైదరాబాద్ కు లైఫ్ లైన్.. ఆర్థిక ప్రగతే లక్ష్యం
Advertisement

CM Revanth Reddy Speech In CII Meet: తెలంగాణను ప్రగతి పథంలో నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన సీఐఐ తెలంగాణ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. పెట్టుబడులకు రక్షణ కల్పిస్తామని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. పరిశ్రమలు అభివృద్ధి చెందేలా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు పడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నాటి ప్రధాని
ఇందిరా గాంధీ ఐడీపీఎల్‌ను ప్రారంభించారని తెలిపారు. అందువల్లే హైదరాబాద్ లో ఫార్మా పరిశ్రమలు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఆ నాటి చర్యల వల్లే
హైదరాబాద్‌ అభివృద్ధి పథంలోకి వెళ్లిందన్నారు.

Advertisement

Read More: కొండగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి..

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు కీలకమని రేవంత్ రెడ్డి అన్నారు. అవుటర్‌ రింగు రోడ్డు అంశాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఓఆర్ఆర్ అవసరమా అని గతంలో చాలా మంది ప్రశ్నించారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ఓఆర్ఆర్ హైదరాబాద్ కు లైఫ్‌లైన్‌గా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు.

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×