CM Revanth: డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతోంది. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం వంటి అంశాల్లో గణనీయ పురోగతి సాధించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభత్వం.
డిసెంబర్ 7 వరకు సీఎం జిల్లాల టూర్
ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించినట్లు సమాచారం తెలిపారు. ఒకటో తేదీన నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి సీఎం జిల్లాల పర్యటనలు ప్రారంభం కానుంది. డిసెంబర్ 7వ తేదీ వరకు ఈ పర్యటనలు కొనసాగి, ప్రతి జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించబడతాయి.
జిల్లాల పర్యటనల్లో పలు ప్రారంభోత్సవాలు..
పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో సీఎం టూర్కు ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాల పర్యటనల్లో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు బహిరంగ సభల్లోనూ సీఎం పాల్గొంటారు.
Also Read: వచ్చే నెలలో గ్లోబల్ సమ్మిట్.. పెట్టుబడుల వేటకు రెడీ అయిన రేవంత్ సర్కార్
డిసెంబరు 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్
డిసెంబరు 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సందర్భంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047ను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరవుతారు. జిల్లా పర్యటనల కంటే ముందు.. సీఎం వివిధ శాఖల్లో జరిగిన అభివృద్ధిపై సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన..
రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
భారీ స్థాయిలో ప్రజాపాలన ఉత్సవాల నిర్వహణకు నిర్ణయం
కార్యక్రమంలో భాగంగా సీఎం జిల్లాల పర్యటన
నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి సీఎం పర్యటన స్టార్ట్
డిసెంబర్ 7 వరకు సీఎం జిల్లాల… pic.twitter.com/yHYVdRa6V0
— BIG TV Breaking News (@bigtvtelugu) November 20, 2025