Kadapa: కడపకు బయలుదేరారు సీఎం రేవంత్రెడ్డి. ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి నేరుగా కడప ఎయిర్పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పోట్లదుర్తిలోని ఎంపీ సీఎం రమేష్కు ఇంటికి చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
అనకాపల్లి ఎంపీగా ఉన్నారు సీఎం రమేష్. ఇటీవల ఆయన తల్లి రత్నమ్మ అకాల మరణం చెందారు. బుధవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స ఆమె మరణించారు. ఇవాళ ఎంసీ సీఎం రమేష్ స్వగ్రామం కడపలోని పోట్లదుర్తికి వెళ్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.
ఎంపీ సీఎం రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాదులో బయలుదేరారు సీఎం రేవంత్. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నేరుగా కడప ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పోట్ల దుర్తి చేరుకోనున్నారు.
అలాగే ఢిల్లీ నుంచి కేంద్రం కమలేష్ పాశ్వాన్ కూడా ఎంపీ ఇంటికి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకి ఢిల్లీలో ఆయన బయలు దేరుతారు. 11.30 కడప ఎయిర్ పోర్టుకు చేసుకుంటారు కేంద్ర మంత్రి కమలేశ్ పాశ్వాన్. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎంపీ ఇంటికి చేరుకున్నారు.