E-Paper
Advertisement

CM Revanthreddy: రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. వరదలపై సాయం కోసం..

CM Revanthreddy: రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. వరదలపై సాయం కోసం..
Advertisement

CM Revanthreddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.  ఈ టూర్‌లో భాగంగా కేంద్రమంత్రులను కలవనున్నారు. ఇటీవల వచ్చిన వరదల వల్ల తెలంగాణలోని నాలుగైదు జిల్లాలు సర్వ నాశనమయ్యాయి. జరిగిన నష్టానికి కేంద్రానికి వివరించనున్నారు.

రెండురోజుల టూర్‌లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించనున్నారు. ఇందులో భాగంగా గురువారం హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. మహబూబాబాద్‌లో 200 హెకార్టలో వరద బీభత్సానికి నాశనమైన చెట్లు, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో జరిగిన నష్టాన్ని గురించి వివరించనున్నారు.

Advertisement

ALSO READ: పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

అమిత్ షాతోపాటు అటవీ పర్యావరణ, ట్రాన్స్‌పోర్టు మంత్రులతో సీఎం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు జరిగిన నష్టానికి పెద్ద ఎత్తున సాయం అందించాలని కోరనున్నారు. వరదల కారణంగా జరిగిన నష్టంపై ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారు ముఖ్యమంత్రి.

Advertisement

మరోవైపు హస్తినలో గురువారం కీలక కాంగ్రెస్ నేతలు అందుబాటులో ఉండనున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని బుధవారం రాత్రికి ఢిల్లీకి రానున్నారు అగ్రనేత రాహుల్‌గాంధీ. ఈ క్రమంలో  కేబినెట్ విస్తరణతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఇతర రాజకీయ అంశాలపై ముఖ్యనేతలతో చర్చించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. పీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఈనెల 15న బాధ్యతల స్వీకరణ ఉండడంతో ఆ కార్యక్రమానికి పార్టీ హైకమాండ్ కీలక నేతలను ఆహ్వానించునున్నారు కొత్త పీసీసీ అధ్యక్షుడు. పనిలోపనిగా సంస్థాగత అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×