E-Paper
Advertisement

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం
Advertisement

Kondareddypalli to become fully solar powered village: ఉన్న ఊరికి, కన్నతల్లికి ఎంత చేసినా తక్కువే అవుతుంది. నేడు అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా తమ సొంత ఊరికి న్యాయం చేయలేకపోతున్నారు. ఎక్కడో మారుమూల కుగ్రామం మహబూబ్ నగర్ జిల్లా, కొడంగల్ మండలంలోని కొండారెడ్డి పల్లికి ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుణ్యమా అని దాని రూపురేఖలే మారిపోనున్నాయి. తెలంగాణలోనే ప్రప్రధమంగా పూర్తి స్థాయి సోలార్ గ్రామంగా రూపొందబోతోంది. దీనిని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన ఊరు అది. బాల్యం, విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయాలలో అఖండ విజయాలను సొంతం చేసుకుని అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణకు రెండో సీఎంగా ఎన్నికయ్యారు.

సీఎం సంక్షేమ పథకాలు

Advertisement

తన సంక్షేమ పథకాల ద్వారా రోజురోజుకూ ప్రజలకు మరింత చేరువగా మారుతున్నారు రేవంత్ రెడ్డి. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తూ ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తున్నారు. రైతు రుణమాఫీ చేసి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అని చేసి చూపించారు. త్వరలో నేతన్నల సమస్యలను కూడా తీర్చేలా వారికి కూడా రుణ మాఫీని ప్రకటిస్తామంటున్నారు. ఇటీవల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారు. ఇలా పలు ప్రజా సంక్షేమ పథకాలతో చొచ్చుకుపోతున్నారు. అయితే తన స్వగ్రామం కొండారెడ్డి పల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ లో ఉన్న కొండారెడ్డి పల్లిని తెలంగాణ రాష్ట్రానికే మోడల్ విలేజ్ గా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారుల బృందం అక్కడ ఇంటింటి సర్వే మొదలు పెట్టారు.

ప్రతి ఇంటికీ సోలార్ ప్యానల్

Advertisement

ప్రతి ఇంటి రూఫ్ పై సోలార్ ప్యానల్ అమర్చేవిధంగా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీఎం ఆదేశాలతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం అక్కడ స్థానిక గ్రామస్తులు, రైతులు, గ్రామ పెద్దలతో కలిసి మాట్లాడి ఈ ప్రాజెక్టు వివరాలను తెలిపారు. ప్రస్తుతం అక్కడ మొత్తం విద్యుత్ వినియోగించేవారు 1,451 మంది ఉన్నారు. కొండారెడ్డి పల్లి గ్రామానికిక సంబంధించి ఎంత విద్యుత్ వినియోగమవుతుంది..విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి ఆ నివేదికను త్వరలో సీఎం ముందుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు అధికారులు. దీనితో కొండారెడ్డి పల్లిలో ఇకపై ఉచితంగానే కరెంట్ సదుపాయం పొందవచ్చు. నెల నెలా కరెంట్ ఖర్చులు ఉండవని గ్రామస్తులు సంబరపడిపోతున్నారు. తమకు ఇలాంటి సదుపాయాలు కల్పిస్తున్న రేవంత్ రెడ్డిని మనసారా అభినందిస్తున్నారు.

Related News

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

Big Stories

Advertisement
×