E-Paper
Advertisement

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం
Advertisement

Kondareddypalli to become fully solar powered village: ఉన్న ఊరికి, కన్నతల్లికి ఎంత చేసినా తక్కువే అవుతుంది. నేడు అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా తమ సొంత ఊరికి న్యాయం చేయలేకపోతున్నారు. ఎక్కడో మారుమూల కుగ్రామం మహబూబ్ నగర్ జిల్లా, కొడంగల్ మండలంలోని కొండారెడ్డి పల్లికి ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుణ్యమా అని దాని రూపురేఖలే మారిపోనున్నాయి. తెలంగాణలోనే ప్రప్రధమంగా పూర్తి స్థాయి సోలార్ గ్రామంగా రూపొందబోతోంది. దీనిని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన ఊరు అది. బాల్యం, విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయాలలో అఖండ విజయాలను సొంతం చేసుకుని అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణకు రెండో సీఎంగా ఎన్నికయ్యారు.

సీఎం సంక్షేమ పథకాలు

Advertisement

తన సంక్షేమ పథకాల ద్వారా రోజురోజుకూ ప్రజలకు మరింత చేరువగా మారుతున్నారు రేవంత్ రెడ్డి. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తూ ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తున్నారు. రైతు రుణమాఫీ చేసి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అని చేసి చూపించారు. త్వరలో నేతన్నల సమస్యలను కూడా తీర్చేలా వారికి కూడా రుణ మాఫీని ప్రకటిస్తామంటున్నారు. ఇటీవల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారు. ఇలా పలు ప్రజా సంక్షేమ పథకాలతో చొచ్చుకుపోతున్నారు. అయితే తన స్వగ్రామం కొండారెడ్డి పల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ లో ఉన్న కొండారెడ్డి పల్లిని తెలంగాణ రాష్ట్రానికే మోడల్ విలేజ్ గా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారుల బృందం అక్కడ ఇంటింటి సర్వే మొదలు పెట్టారు.

ప్రతి ఇంటికీ సోలార్ ప్యానల్

Advertisement

ప్రతి ఇంటి రూఫ్ పై సోలార్ ప్యానల్ అమర్చేవిధంగా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీఎం ఆదేశాలతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం అక్కడ స్థానిక గ్రామస్తులు, రైతులు, గ్రామ పెద్దలతో కలిసి మాట్లాడి ఈ ప్రాజెక్టు వివరాలను తెలిపారు. ప్రస్తుతం అక్కడ మొత్తం విద్యుత్ వినియోగించేవారు 1,451 మంది ఉన్నారు. కొండారెడ్డి పల్లి గ్రామానికిక సంబంధించి ఎంత విద్యుత్ వినియోగమవుతుంది..విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి ఆ నివేదికను త్వరలో సీఎం ముందుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు అధికారులు. దీనితో కొండారెడ్డి పల్లిలో ఇకపై ఉచితంగానే కరెంట్ సదుపాయం పొందవచ్చు. నెల నెలా కరెంట్ ఖర్చులు ఉండవని గ్రామస్తులు సంబరపడిపోతున్నారు. తమకు ఇలాంటి సదుపాయాలు కల్పిస్తున్న రేవంత్ రెడ్డిని మనసారా అభినందిస్తున్నారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×