E-Paper
Advertisement

Congress: మర్రిపై వేటు.. ఆరేళ్ల పాటు.. కాంగ్రెస్ షాక్

Congress: మర్రిపై వేటు.. ఆరేళ్ల పాటు.. కాంగ్రెస్ షాక్
Advertisement

Congress: సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిపై వేటు వేసింది కాంగ్రెస్ అధిష్టానం. అమిత్ షాను కలిసినందుకు గాను.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ.. ఆరేళ్ల పాటు ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించి షాక్ ఇచ్చింది.

తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానంటూ మర్రి మీడియా ముందు చెప్పిన కొన్నిగంటల్లోనే ఆయనపై వేటు వేసింది హైకమాండ్. టెక్నికల్ గా శశిధర్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ కు రిజైన్ చేయకపోవడంతో.. ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు పార్టీ ప్రకటించడం ఆసక్తికరం.

Advertisement

శుక్రవారం అమిత్ షాను కలిసిన మర్రి.. పార్టీలో చేరడంపై చర్చించినట్టు తెలుస్తోంది. బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం సందర్భంగా ఆయన కాషాయ కండువా కప్పుకోవచ్చని సమాచారం. అంతలోనే, శశిధర్ రెడ్డిపై వేటు వేస్తూ.. తామే పార్టీ నుంచి పంపించేశామనే మెసేజ్ ఇచ్చింది కాంగ్రెస్.

అంతకుముందు.. మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి బాగోలేదని.. తెలంగాణలో చెంచాగాళ్లతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. పీసీపీ పదవి రేవంత్‌ రెడ్డికి ఇవ్వొద్దని తాను కూడా అధిష్టానానికి చెప్పానన్నారు మర్రి.

Advertisement

తనలాంటి ఒక హోంగార్డు పార్టీ నుంచి పోతే పోయేదేమీ లేదంటూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డైలాగ్ ను రిపీట్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తాను కాంగ్రెస్ ను వీడుతున్నానంటూ చెప్పుకొచ్చారు శశిధర్ రెడ్డి.

టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదని.. హస్తం పార్టీకి క్యాన్సర్ సోకిందని.. అది నయం చేయలేని స్థితికి చేరిందంటూ సంచలన కామెంట్స్ చేశారు. తనలానే త్వరలోనే చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడుతారంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు.

మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్నారు. పీజేఆర్ ఉన్న కాలంలో హైదరాబాద్ బ్రదర్స్ గా హైకమాండ్ దగ్గర మంచి పరపతి ఉండేది. అయితే, ఆ తర్వాతి కాలంలో నియోజకవర్గంలో బలం తగ్గిపోవడం, వరుస ఓటమిలతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. సీనియర్లతో సెపరేట్ గ్రూప్ మెయిటెన్ చేస్తున్నారనే ఆరోపణ ఉంది. ఇక కాంగ్రెస్ లో తన ఉనికి కష్టమేనని భావించిన మర్రి.. బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ను వీడుతున్నానంటూ ప్రకటించారు. ఆ విషయం తెలిసి ఆయనపై ఆరేళ్ల పాటు వేటు వేసింది హస్తం పార్టీ. త్వరలోనే మర్రి కాషాయ కండువా కప్పుకోవడం ఖాయం.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×