Congress Vs BJP: దారుణంగా మారుతున్న రాజకీయ విభేదాలు.. ఒకరినొకరు విమర్శించుకోవడం ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడమే పనిగా మారిపోయింది. ఇప్పుడు కూడా ఇద్దరు నేతలు దారుణంగా లైవ్లో అందరికి తెలిసేలా కొట్టుకున్నారు.
అయితే ఇద్దరు ప్రధాన నేతలు లైవ్లో మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య రాజకీయ చర్చ ఊహించని మలుపు తిరిగింది. ఈ ఇద్దరి మధ్య గొడవ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలు గొడవకు కారణం..
పలువురి నేతల మధ్య రాజకీయ చర్చ జరిగింది. అయితే ఈ చర్చ బీసీ బిల్లులు గురించి జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రెండున్నర కోట్ల బీసీల బిల్లులను నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రవర్తించిన విధానం పై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత మేము చేయాలనుకుంటే చేసి చూపిస్తాం అని అడగగా.. యాంకర్ అంటే మీ పార్టీ చేయాలనుకుంటే చేస్తారు లేదంటే చెయ్యరు అంతేనా అని చెప్పింది. దీంతో బీజేపీ ఎనుగంటి రాజు నేత కాంగ్రెస్ నేతను మీకు తెలంగాణ బీసీలు అంటే లెక్క లేదా అని ప్రశ్నించారు.
Also Read: పసిడి ప్రియులకు బిగ్షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు తులం ఎంతంటే..!
ఒక్కసారిగా కాంగ్రెస్ నేత సీరియస్ అయ్యారు. దీంతో బీజేపీ నేత రాజు కాంగ్రెస్ నేతను నెట్టాడు. ఇరువురి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. బీఆర్ఎస్ ప్రతినిధి ఇద్దరిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. కానీ వారి ఇద్దరి మధ్య వాగ్వాదం గట్టిగానే జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Kalesh b/w BJP worker and Congress worker during Live TV debate:
pic.twitter.com/FMGooyLvxk— Ghar Ke Kalesh (@gharkekalesh) November 20, 2025