Big Stories

Congress: పెండింగ్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. గ్రాడ్యుయేట్ బైపోల్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న..

Congress: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో కూడా గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న మూడు లోక్ సభ స్థానాలకు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్.. అధిష్ఠానం నిర్ణయం మేరకు అభ్యర్థులను ఖరారు చేశారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్ఠానం నిర్ణయించింది.

- Advertisement -

కరీంనగర్- వెలిచాల రజేందర్ రావు
హైదరాబాద్- మహమ్మద్ వలీవుల్లా సమీర్
ఖమ్మం- రామసాహాయం రఘురామ్ రెడ్డి

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News