Congress leader Murder: నిజామాబాద్ జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నేత ఇమ్మడి గోపీ దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి తన కారులో స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటన విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు.
నిజామాబాద్ జిల్లాలో దారుణం.. కాంగ్రెస్ నేత దారుణహత్య
ఏపీ మాదిరిగా తెలంగాణ రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నేత ఇమ్మడి గోపీ దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి తన కారులో స్వగ్రామానికి వెళ్తుండగా, ఇందల్వాయి ప్రాంతం శివారులో మరో కారుతో గోపి కారుని బలంగా ఢీ కొట్టాడు.
యాక్సిడెంట్ తర్వాత కారులోని వ్యక్తులు బయటకు వచ్చి అత్యంత దారుణంగా హత మార్చాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు ఇందల్వాయి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. హత్య గురించి తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ నేత గోపిని అత్యంత దారుణంగా హత్య చేసిన దగ్గర బంధువు
ఇందల్వాయి మండలానికి చెందిన గోపి కొన్నాళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఆయన సేవలు అందించారు. ఇందల్వాయి మండలంలో ఎంపీపీగా గోపి తన సేవలు అందించారు. ముదిరాజ్ సంఘంలో క్రీయాశీలక పాత్ర పోషించిన ఆయన, సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు.
ఇటీవల గోపి భార్య హేమలత గౌరారం సర్పంచిగా గెలిచారు కూడా. అయితే గోపీని హత మార్చింది సమీప బంధువని తెలుస్తోంది. వరుసకు మేనల్లుడు అవుతాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు తనంతట తాను పోలీసుల వద్ద లొంగిపోవడంతో హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. మండలంలో అంచెలంచెలుగా ఎదిగిన గోపి, అధికార పార్టీకి చెందిన కీలక నేతగా మారారు.
ALSO READ: బయట పడ్డ ఉర్దూ మీడియం హై స్కూల్ బండారం.. మరీ ఇంత నిర్లక్ష్యమా..!
నిజామాబాద్ లో కాంగ్రెస్ నేత దారుణ హత్య
నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలం గౌరారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి కారుపై దాడి చేసి హత్య
అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన దాడి చేసిన వ్యక్తి
కాగా హత్య చేసింది గోపి దగ్గరి బంధువుగా గుర్తింపు
పాత కక్షల కారణంగానే… pic.twitter.com/5GC4Z2hax7
— BIG TV Breaking News (@bigtvtelugu) March 12, 2026