E-Paper
Advertisement

Congress : సీఎం రేవంత్ మదిలో కొత్త ప్లాన్.. ప్రజల్లోకి మంత్రులు, ఎమ్మెల్యేలు!

Congress : సీఎం రేవంత్ మదిలో కొత్త ప్లాన్.. ప్రజల్లోకి మంత్రులు, ఎమ్మెల్యేలు!

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రతీ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్టు తెలుస్తున్నది. వచ్చేనెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అనంతరం హైదరాబాద్ వీడి ఆయన జిల్లాల పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో పాటే మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పర్యటిస్తూ అక్కడి స్థానిక సమస్యలపై ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. పెండింగ్ పనులకు సంబంధించిన ఫిర్యాదులు రావడమే ఆలస్యం.. వెంటనే నిధులు మంజూరు చేయడంతో పాటు పని పూర్తయ్యే అంతవరకూ మానిటరింగ్ చేసే బాధ్యతను సైతం స్థానిక లీడర్లపై సీఎం పెట్టనున్నట్టు తెలుస్తోంది.

పాలనపై పట్టు.. గుడ్ గవర్నెన్స్

రాష్ట్రంలోని ప్రజలకు మంచి పాలనను అందించే ఉద్దేశంతో సీఎం రేవంత్ ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రులతో కలిసి ఆయన జిల్లాలు, పల్లెలకు పయనం కానున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నది? ఎక్కడైనా ప్రజలు అసంతృప్తితో ఉన్నారా? అని వివరాలు సేకరించనున్నారు.సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతున్నాయా? అధికారులు సరిగా స్పందిస్తున్నారా? లేక మౌలిక సదుపాయాలు కల్పన సరిగా జరుగుతున్నదా? లేదా అని మంత్రులతో కలిసి సీఎం సమీక్ష చేయనున్నట్టు తెలుస్తోంది. తద్వారా క్షేత్ర స్థాయిలో సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వాటిని పూర్తి చేయాలని అటు అధికారులు,నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు సమాచారం.

ఇలా చేయడం ద్వారా పూర్తి స్థాయిలో పాలనపై పట్టుసాధించడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.జనరల్ ఎలక్షన్స్‌కు ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నది. ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభిస్తేనే మరోసారి పార్టీకి అధికారం సాధ్యం అవుతుందని ఆయన అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. మరల స్కూల్స్ రీ ఓపెన్ అయ్యేలోపు అనగా 90 రోజుల పాటు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో పర్యటించి స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటికి పరిష్కారం చూపనున్నట్టు తెలుస్తోంది.

CM Chandrababu: కాళేశ్వరంకు మేం అభ్యంతరం చెప్పలేదు.. నల్లమల సాగర్‌కు వాళ్లు సహకరించాలి, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

నెగెటివిటీని దూరం చేసేందుకు..

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటింది. నేటికి కొన్న చోట్ల సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీలు అమలవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు హైడ్రా పేరిట అక్రమార్కుల గుండెల్లో ప్రభుత్వం రైళ్లను పరిగెట్టిస్తున్నది.కొందరు ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు పాల్పడిన వారిపైనా సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. అయితే, జిల్లాలతో పాటు నగరంలోని కొన్ని చోట్ల హైడ్రా చర్యలకు కొంత నెగెటివిటి ప్రచారం అధికంగా జరిగింది. సంక్షేమ పథకాలు రాలేదని కొందరు అధికార పార్టీని దూషిస్తున్నారు. వారికి అసలు విషయాలు చెప్పడంతో పాటు ప్రభుత్వం మీద సానుకూలత తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారని తెలుస్తున్నది. మొత్తంగా కాంగ్రెస్ పాలనలో గ్రామ స్వరాజ్యం సాధించాలని, ఈ మేరకు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక లీడర్లు కృషి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×