E-Paper
Advertisement

Gadida Guddu Posters in Hyderabad: హైదరాబాద్‌లో ‘గాడిద గుడ్డు’ ఫ్లెక్సీలు.. భారీగా చర్చ

Gadida Guddu Posters in Hyderabad: హైదరాబాద్‌లో ‘గాడిద గుడ్డు’ ఫ్లెక్సీలు.. భారీగా చర్చ
Advertisement

Gadida Guddu Posters in Hyderabad: కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ఆర్థిక బడ్జెట్ 2024-25 ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ బీహార్, ఏపీ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఆ రాష్ట్రాలకు అధిక కేటాయింపులు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. ఎన్డీయేలో భాగంగా ఉన్న పార్టీలకు సంబంధించిన రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ నిధులు కేటాయించారు.. మిగతా రాష్ట్రాలను పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు ఖర్గే, రాహుల్ గాంధీతోపాటు ఇతర ముఖ్య నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు.

ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఏపీ రాష్ట్రానికి అధిక నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు ఇవ్వరంటూ నిలదీశారు. అన్ని రాష్ట్రాలకు ఐఐఎంలు ఇచ్చినప్పుడు ఒక్క తెలంగాణకే ఇవ్వబోమంటూ ఎలా చెబుతారంటూ ఫైరయ్యారు. ఆది నుంచి కూడా మోదీ తెలంగాణపై వివక్ష చూపుతున్నారన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చింది గుండు సున్నా అంటూ ఎద్దేవా చేశారు.

Gadida Guddu Posters
Gadida Guddu Posters
Advertisement

Also Read: మాపై ఎందుకీ సవతి ప్రేమ: శ్రీధర్ బాబు

ఇది ఇలా ఉంటే.. నగరంలో పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ బ్యానర్లను ఏర్పాటు చేసి నిరసనను వ్యక్తం చేసింది. ‘బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లు ఇస్తే.. కేంద్ర బడ్జెట్‌లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు’ అంటూ కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై వినూత్న రీతిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నిరసన తెలిపింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు, స్థానికులు ఆ బ్యానర్లను ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లుప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Related News

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆపై ప్రభుత్వం ప్రకటన

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

Big Stories

Advertisement
×