BigTV English
Advertisement

MLA Raja Singh: ఆ టపాసుల వెనుక కుట్ర.. అస్సలు కొనుగోలు చేయవద్దు.. ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక

MLA Raja Singh: ఆ టపాసుల వెనుక కుట్ర.. అస్సలు కొనుగోలు చేయవద్దు.. ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక

MLA Raja Singh: దీపావళి పండుగను పురస్కరించుకుని ఎమ్మేల్యే రాజాసింగ్ ఓ ప్రకటనతో హెచ్చరిక జారీ చేశారు. అలా చేసి.. మన దేవుళ్లను మన దేవుళ్లను మనం అప్రతిష్ట పాలు చేయవద్దని, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని రాజాసింగ్ కోరారు. దీపావళి రోజు రాజా సింగ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇంతకు రాజాసింగ్ ఏం చెప్పారంటే?


హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మేల్యే రాజాసింగ్ అంటే తెలియని వారు ఉండరు. హిందుత్వ వాదిగా గుర్తింపు పొందిన రాజాసింగ్ నిరంతరం తన వాదాన్ని వినిపిస్తూ.. హిందువులలో ఐక్యతను, మానవత్వాన్ని పెంపొందించేలా తనదైన శైలిలో ప్రసంగాన్ని సాగిస్తూ ఆకట్టుకుంటుంటారు. అలాంటి ఎమ్మేల్యే రాజాసింగ్ దీపావళి సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మేల్యే రాజాసింగ్ దీపావళి రోజు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఎమ్మేల్యే మాట్లాడుతూ… హిందువులందరూ ఆనందంగా దీపావళి పండుగను జరుపుకోవాలన్నారు. అలాగే టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నారులు తప్పనిసరిగా పెద్దల సమక్షంలో టపాసులు కాల్చాలన్నారు. అయితే ఇటువంటి ప్రసంగం చేసిన రాజాసింగ్.. ఓ సూచన సైతం జారీ చేశారు. దేవుడి బొమ్మలతో గల పటాకులను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దని, అటువంటి పటాకుల తయారీ వెనుక కుట్ర ఉందన్నారు.


ప్రధానంగా లక్ష్మీ దేవి బొమ్మ ఉన్న టపాసులను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేసి కాల్చవద్దని, దేవుళ్ళ బొమ్మలు ఉన్న ఎటువంటి టపాసులైనా, కొనుగోలు చేయకుండా హిందువులు జాగ్రత్తగా ఉండాలన్నారు. మన దేవుళ్లను మనం పూజిస్తాం. అటువంటిది దేవుళ్ల బొమ్మలు ఉన్న టపాసులను మనమే కాల్చడం ఎంతవరకు సమంజసమన్నారు.

Also Read: Pushpa 2 Diwali Wishes: దీపావళికి బ్లాస్ట్ అయ్యేలా.. పుష్ప 2 అప్డేట్..!

ఎమ్మేల్యే రాజాసింగ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ నిర్వహించడం ఆనవాయితీ. అలా అమ్మవారిని పూజించే మనం, సాయంత్రం కాగానే, ఆ దేవి బొమ్మలతో తయారు చేసిన టపాసులు కొనుగోలు చేయడం, వాటిని కాల్చడం ఏమిటని రాజాసింగ్ ప్రశ్నించారు. అయితే కొందరు రాజాసింగ్ ప్రకటనతో ఏకీభవిస్తూ, ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. చివరగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలను ఎమ్మేల్యే తెలిపారు.

Related News

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Big Stories

×