E-Paper
Advertisement

Corruption Cases: తెలంగాణ ఏర్పడినప్పటి నుండి దారుణంగా పెరిగి పోయిన అవినీతి.. ఇదిగో లెక్కలు..!

Corruption Cases: తెలంగాణ ఏర్పడినప్పటి నుండి దారుణంగా పెరిగి పోయిన అవినీతి.. ఇదిగో లెక్కలు..!

Corruption Cases: స్వేఛ్చ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌రువాత ప్ర‌భుత్వ పాల‌న‌లో అవినీతి పెరిగిపోయిందని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ అధ్య‌క్షుడు ప‌ద్మ‌నాభ‌రెడ్డి అన్నారు. త‌ప్పు చేస్తే శిక్ష‌ప‌డుతుంది అన్న భ‌యం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌లో ఏ కోశాన లేదని, ఏ.సీ.బీ., విజిలెన్స్ శాఖ‌లు విచార‌ణ జ‌రిపి ప్ర‌భుత్వానికి పంపిన నివేదిక‌ల‌పై చ‌ర్య‌లు లేవన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మంగళవారం లేఖ రాశారు. లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన లేక ఆశ్రిత ప‌క్ష‌పాతం, బంధు ప్రీతితో ప్ర‌భుత్వానికి న‌ష్టం క‌లిగించే నిర్ణ‌యాలు తీసుకున్న రిపోర్టులు సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఎటువంటి చ‌ర్య‌లు లేక స‌చివాల‌యంలో ప‌డి ఉన్నాయి. పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. విజిలెన్స్ రిపోర్టుల‌ను ఏదో ఒక వంక‌తో సాగ‌దీసి చివ‌ర‌కు చిన్న ప‌నిష్మెంట్ లేదా కేసు డ్రాప్ చేయ‌డం జ‌రుగుతుందన్నారు.

విజిలెన్స్ కేసులు 129 కాగా..

రాష్ట్ర స‌చివాల‌యంలో ఏ.సీ.బీ., విజిలెన్స్ శాఖ‌ల రిపోర్టుల‌పై త‌గిన చ‌ర్య‌లు గైకొన‌డం లేదన్నారు. రెవెన్యూ శాఖ‌లో మొత్తం 323 ఏసీబీ కేసులు ఉండ‌గా అందులో 5 కేసులు మాత్ర‌మే డిస్పోజ్ అయి మిగిలిన 318 కేసులు వివిధ ద‌శ‌ల‌లో ప‌రిశీల‌న‌లో ఉన్నాయన్నారు.(ఈ 323 కేసుల‌లో చాలా వరకు 10ఏళ్ల క్రితం న‌మోదైన కేసులు). ఇక విజిలెన్స్ కేసులు 129 కాగా అందులో నుంచి 8 కేసులు మాత్ర‌ము డిస్పోజ్ అయి మిగ‌తా 121 కేసులు సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ప‌రిశీల‌న‌లో ఉన్నాయన్నారు. ఏసీబీ అధికారులు ప్ర‌తిరోజు ఏదో ఒక చోట కేసులు న‌మోదు చేస్తున్నారన్నారు.

Also Read: Chai Wala: సెన్సార్ దెబ్బకి టైటిల్ మార్చేశారు.. న్యూ టైటిల్ ఇదే!

లంచాలు ఇంకా ఎక్కువయ్యాయి..

అవినీతి అధికారుల ఇళ్ల సోదాలు చేసిన‌ప్పుడు పెద్ద ఎత్తున డ‌బ్బు, ఆస్తులు ప‌ట్టుబ‌డుతున్నాయని, దీంతో ప్రసార మాధ్య‌మాలు హైలైట్ చేస్తున్నాయన్నారు. దీనితో ప్ర‌జ‌లు, ఏసీబీ ప‌నిని ప్ర‌శంసిస్తూ అవినీతి అధికారులకు శిక్ష ప‌డుతుంద‌ని ఇక వారికి లంచాల బెడ‌ద త‌ప్పుతుంద‌ని భావిస్తున్నారన్నారు. అయితే లంచాలు త‌గ్గ‌క‌పోగా ఇంకా ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి అధికారులు ఏసీబీకి ఒక‌టి కంటే ఎక్కువ సార్లు ప‌ట్టుబ‌డ్డ ఉదంతాలు ఉన్నాయన్నారు. పాల‌న‌లో అవినీతి గురించి గ‌తంలో సీఎంకి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి సంబంధిత శాఖ‌ల కార్య‌ద‌ర్శుల‌కు లేఖ‌లు రాయ‌డం జ‌రిగిందన్నారు. ఇంత‌వ‌ర‌కు దీనిపై ఎటువంటి చ‌ర్య‌లు లేవు అని, దీనితో ప్ర‌భుత్వానికి కూడా చెడ్డ‌పేరు వ‌స్తుందన్నారు. ఏసీబీ, విజిలెన్స్ కేసులు త్వరగా ప‌రిష్కార‌మ‌య్యేలా, అలాగే అవినీతి అధికారులకు శిక్ష ప‌డే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎంను కోరారు.

Also Read: Toxic film: మరో వివాదంలో యశ్ టాక్సిక్.. నిర్మాతలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు..

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×