BigTV English

Munugode : కౌంట్ డౌన్ షురూ.. మునుగోడులో హై టెన్షన్…

Munugode : కౌంట్ డౌన్ షురూ.. మునుగోడులో హై టెన్షన్…

Munugode : మునుగోడు మూగబోయింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. ఎక్కడివారక్కడే గప్ చుప్. బయటి వాళ్లకి బై బై చెప్పేసి.. స్థానికులు నోట్ల వేటలో బిజీ అయ్యారు.


పార్టీలకు పోటీగా ఎన్నికల సంఘం, పోలీసులు సైతం వేటకు రెడీగా ఉన్నారు. పోలీసులు మునుగోడు నియోజకవర్గాన్ని అష్టదిగ్బంధనం చేసేశారు. సరిహద్దుల్లో వంద చెక్ పోస్టులు పెట్టారు. భారీగా బలగాలను మోహరించారు. సాయంత్రం 6 నుంచి తనిఖీలు పెంచేశారు. వాహనాల సోదాలతో పాటు ప్రతీ ఇంటిని జల్లడపట్టే పనిలో ఉన్నారు.

105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది ఈసీ. 3వేల మందికి పైగా రాష్ట్ర పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలను తరలించింది. మంగళవారం పలివెలలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు దాడులకు తెగబడటంతో మరిన్ని అదనపు బలగాలను మునుగోడుకు తరలిస్తోంది ఎన్నికల సంఘం. 200 పోలీస్ బృందాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. అక్రమ నగదుపై కన్నేసి ఉంచడానికి ఐటీ టీమ్స్ రెడీగా ఉన్నాయి.


మంగళవారం సాయంత్రం ప్రచార సమయం ముగిశాక.. బయటి వారెవరూ నియోజకవర్గంలో ఉండకూడదు. ప్రధాన మీడియాతో పాటు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలోనూ ఎలాంటి ప్రచారం చేయకూడదు. బల్క్ మెసేజ్ లపై నిషేధం ఉంది.

మునుగోడులో 2.41 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 51 బృందాలు ఎన్నికల విధుల్లో ఉన్నాయి. ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసినా.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలింగ్ ఎలా జరుగుతుందోననే టెన్షన్ టెన్షన్..

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×