E-Paper
Advertisement

Heavy rains: అత్యంత భారీ వర్షాలు.. రేపు స్కూళ్లకు సెలవు ఉందా..? లేదా..? ఇదిగో క్లారిటీ

Heavy rains: అత్యంత భారీ వర్షాలు.. రేపు స్కూళ్లకు సెలవు ఉందా..? లేదా..? ఇదిగో క్లారిటీ
Advertisement

Heavy rains: భారీ వర్షాల కారణంగా రేపు (గురువారం) సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడం.. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వంటి కారణాల వల్ల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

భారీ వర్షాలు సిద్దిపేట జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలోనే.. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు, అంటే గురువారం నాడు జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఆమె ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ వర్షాల ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్నిచోట్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో విద్యార్థులు పాఠశాలలకు చేరుకోవడం ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితులను సమీక్షించిన జిల్లా కలెక్టర్ హైమావతి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ సెలవు నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

Advertisement

రేపు మాత్రమే స్కూళ్లకు సెలవు..?

సెలవు కేవలం ఒక్క రోజు (గురువారం) మాత్రమే వర్తిస్తుందని.. తదుపరి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ కార్యాలయం నుండి స్పష్టం చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే యధావిధిగా విద్యాసంస్థలు తెరుచుకుంటాయని తెలిపారు. సెలవు సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు.

కలెక్టర్ సూచనలు..

పిల్లలు నీటి ప్రవాహాలు, చెరువులు, కుంటల దగ్గరకు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నుండి దూరంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని కోరారు. ఎలాంటి ఆపద వచ్చినా లేదా అత్యవసర సహాయం కావాలన్నా, జిల్లాలోని కంట్రోల్ రూమ్ నంబర్లకు లేదా స్థానిక అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ సెలవు విషయాన్ని అన్ని విద్యాసంస్థలకు, విద్యార్థులకు చేరేలా చర్యలు చేపట్టారు. విద్యార్థులు ఈ సెలవును భద్రంగా ఇంట్లోనే గడిపి, వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాల కారణంగా జనజీవనానికి అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో.. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిచ్చింది.

ALSO READ: Jangaon District: విద్యార్థులందరూ భోజనం చేశాక సాంబార్‌లో బల్లి ప్రత్యక్షం.. జనగామ జిల్లాలో ఘటన

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×