E-Paper
Advertisement

Heavy rains: అత్యంత భారీ వర్షాలు.. రేపు స్కూళ్లకు సెలవు ఉందా..? లేదా..? ఇదిగో క్లారిటీ

Heavy rains: అత్యంత భారీ వర్షాలు.. రేపు స్కూళ్లకు సెలవు ఉందా..? లేదా..? ఇదిగో క్లారిటీ
Advertisement

Heavy rains: భారీ వర్షాల కారణంగా రేపు (గురువారం) సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడం.. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వంటి కారణాల వల్ల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

భారీ వర్షాలు సిద్దిపేట జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలోనే.. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు, అంటే గురువారం నాడు జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఆమె ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ వర్షాల ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్నిచోట్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో విద్యార్థులు పాఠశాలలకు చేరుకోవడం ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితులను సమీక్షించిన జిల్లా కలెక్టర్ హైమావతి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ సెలవు నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

Advertisement

రేపు మాత్రమే స్కూళ్లకు సెలవు..?

సెలవు కేవలం ఒక్క రోజు (గురువారం) మాత్రమే వర్తిస్తుందని.. తదుపరి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ కార్యాలయం నుండి స్పష్టం చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే యధావిధిగా విద్యాసంస్థలు తెరుచుకుంటాయని తెలిపారు. సెలవు సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు.

కలెక్టర్ సూచనలు..

పిల్లలు నీటి ప్రవాహాలు, చెరువులు, కుంటల దగ్గరకు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నుండి దూరంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని కోరారు. ఎలాంటి ఆపద వచ్చినా లేదా అత్యవసర సహాయం కావాలన్నా, జిల్లాలోని కంట్రోల్ రూమ్ నంబర్లకు లేదా స్థానిక అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ సెలవు విషయాన్ని అన్ని విద్యాసంస్థలకు, విద్యార్థులకు చేరేలా చర్యలు చేపట్టారు. విద్యార్థులు ఈ సెలవును భద్రంగా ఇంట్లోనే గడిపి, వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాల కారణంగా జనజీవనానికి అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో.. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిచ్చింది.

ALSO READ: Jangaon District: విద్యార్థులందరూ భోజనం చేశాక సాంబార్‌లో బల్లి ప్రత్యక్షం.. జనగామ జిల్లాలో ఘటన

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×