E-Paper
Advertisement

కాళేశ్వరం నిధులతో కూతురి పెళ్లి.. చిక్కుల్లో రిటైర్డ్ ఐఏఎస్.. కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు!

కాళేశ్వరం నిధులతో కూతురి పెళ్లి.. చిక్కుల్లో రిటైర్డ్ ఐఏఎస్.. కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు!
Advertisement

Delhi High Court: తెలంగాణ క్యాడర్ కు చెందిన​ ఐఏఎస్​ అధికారి రజత్ కుమార్ కూతురి పెళ్లి ఖర్చుకు సంబంధించిన వివాదంలో మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రజత్ కుమార్ కూతురి పెళ్లి విలాసవంతమైన తాజ్​ ఫలక్​ నుమా ప్యాలెస్​ తోపాటు పలు ఖరీదైన ఫైవ్ స్టార్​ హోటళ్లలో అయిదు రోజులపాటు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఖర్చులు అన్నింటినీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ కంపెనీ మేఘా ఇంజనీరింగ్​ అండ్​ ఇన్​ ఫ్రాస్ట్రక్చర్​ లిమిటెడ్.. తన​ షెల్ కంపెనీల ద్వారా చెల్లింపులు జరిపిందంటూ నారాయణ పేట్​ కు చెందిన సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్​ గతంలో డీవోపీటీలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవటంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు.

దీనిపై మంగళవారం విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు నాలుగేళ్లుగా కేసు విచారణలో పురోగతి లేకపోవటంపై అసహనం వ్యక్తం చేసింది. పిటిషనర్​ చేసిన ఫిర్యాదుపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఐఏఎస్​ అధికారి రజత్ కుమార్​ ప్రాజెక్టును పర్యవేక్షించే ఇరిగేషన్​ అండ్ కమాండ్​ ఏరియా డెవలప్ మెంట్​ విభాగానికి చీఫ్​ గా పని చేశారు. ఆ సమయంలోనే రజత్ కుమార్​ కూతురి వివాహం 5 రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది.

Advertisement

Also Read: Viral Video: కంత్రి దొంగ.. సూట్‌లో గెస్టుగా వచ్చి.. నీటుగా రూ.5 లక్షలు ఎత్తుకెళ్లాడు!

తాజ్ ఫలక్​ నుమా, తాజ్​ కృష్ణ, తాజ్​ డెక్కన్​ హోటళ్లలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. అతిథులకు ఈ స్టార్​ హోటళ్లలోనే బస కల్పించారు. తాజ్ ఫలక్​ నుమాలో అప్పట్లో రజత్ కుమార్​ ఓ విందు కూడా ఇచ్చారు. ఒక్కో ప్లేట్ కు 16వేల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్టుగా ప్రచారం జరిగింది. కాగా, ఈ వేడుకలకు అయిన ఖర్చులు అన్నింటినీ మేఘా కంపెనీ షెల్ కంపెనీల ద్వారా చెల్లించినట్టుగా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆ సంస్థ ఎగ్జిక్యూటీవ్​ లు కంపెనీ మెయిల్ ఐడీలతోపాటు కొన్ని డమ్మీ ఐడీలను ఉపయోగించి ఈవెంట్లను సమన్వయం చేసినట్టుగా ప్రచారం జరిగింది. తొలుత ఫేక్ ఐడీలు వాడినా ఆ తరువాత తమ అధికారిక మెయిల్ ఐడీలను వినియోగించినట్టుగా వార్తలొచ్చాయి.

Advertisement

Also Read: Air Coolers: ప్లాస్టిక్ vs ఐరన్ కూలర్లు.. మెరుగైన కూలింగ్‌కు.. రెండింటిలో ఏది బెస్ట్?

Related News

ఈసారి దక్షిణాది వంతు.. వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు, హైదరాబాద్‌లో అయితే..

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×